మా రచయితలు

పుట్టింది శట్పల్లి గ్రామం కామారెడ్డి జిల్లా. 'కళ్లం' (సాహిత్య వ్యాసరాశి) వ్యాస సంపుటి ప్రచురించారు. ‘తెలంగాణ సాహిత్య గ్రంథసూచి’ ప్రధాన సంపాదకుడిగా, ‘నిత్యాన్వేషణం’, ‘శిలాక్షరం’ గ్రంథాలకు సంపాదకునిగా చేశారు. ‘మహాభారతంలో సంవాదాలు - సమగ్రపరిశీలన' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు. 'మూసీ సాహిత్య ధార' సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

జ‌న‌నం: తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. క‌వి, ర‌చ‌యిత‌, ఉపాధ్యాయుడు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద వ్యతిరేక సాహిత్య సృజన వీరి ప్రత్యేకత. 'ఆవాహన','పారిపోలేం', కవితా సంపుటాలు వచ్చాయి. 'పిట్టలేనిలోకం', 'పర్యావరణ ప్రయాణాలు' అనే దీర్ఘకవితలు ప్రచురించారు. 'సీమెన్'  కథా సంపుటి ముద్రించారు.

కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. విప్లవ రచయితల సంఘం సభ్యుడు. రచనలు: 1. గెరిల్లా గుండె లయలు(1994), 2. నెత్తుటి రుతుపవనాలు. దీర్ఘ కవితలు: 1. ముఫ్పయి వసంతాాలు ముఫ్పయి శిశిరాల మీదుగా, 2. చరిత్ర రహదారుల్లో మొచిలిన పిచ్చి జిల్లేడు మొక్క, 3. కాసిని పద్యాల్ని మూటగట్టుకొని జిప్సీలా అతడు మనల్ని దాటిపోతాడు, 4. తెలంగాణా! ఈ యుద్ధ గానాన్ని ఆపొద్దు, 5. అతడు సామాన్యుల ప్రవక్త, 6. ఈ మౌనం ఖచ్చితంగా యుద్ధనేరమే, 7. తెలంగాణా! నీ గాయాలు వర్థిల్లనీ, 8. కొన్ని సీతాకోక చిలుకలు ఎగరగలవు. 9. ఇదేదో చాటుమాటు  వ్యవహారమే. అనువాదాలు:  1. నైరుతి రుతుపవనాల కాలమిది, 2. తుఫానులకెదురు నడవరా! , 3.  దఓిణ తూర్పు పవనాలతో ముఖాముఖం, 4. గంధకపు వాగొడ్డు ముసలోడా! నువు చెప్పిందే నిజం.

పుట్టింది విజయవాడ. కవి. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (కామర్స్)పూర్తి చేశారు. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చదువుతున్నారు. 2014 లో మిత్రులతో కలిసి "తీరం దాటిన నాలుగు కెరటాలు" పేరుతో ఒక సంకలనం తెచ్చారు. రచనలు : 'ఎనిమిదో రంగు' (2017), 'స్పెల్లింగ్ మిస్టేక్' (2019)అనే కవితా సంకలనాలు ప్రచురించారు. వెబ్ మ్యాగజైన్ 'రస్తా'లో దివంగత రచయితల మీద 'స్మరణ' అనే కాలమ్ రాస్తున్నారు. ప్రస్తుతం ఓ ప్రయివేట్ సంస్థలో అక్కౌంట్స్ విభాగంలో పని చేస్తున్నారు.

పుట్టింది వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌. క‌వి, ర‌చ‌యిత‌. విద్యాభ్యాసం వ‌రంగ‌ల్‌లో. బాల్యం నుంచే సాహిత్య‌- ఉద్య‌మాల ఆస‌క్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్య‌మం మొద‌లు, మొన్న‌టి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వివిధ సాహిత్య, ప్ర‌జా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. 12 స్వీయ ర‌చ‌న‌ల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంక‌ల‌నాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కవయిత్రి. కథా రచయిత. కృష్ణాజిల్లా కేసరపల్లి గ్రామం. కవిత్వం, కథలంటే ఆసక్తి. వివిధ వెబ్ పత్రికల్లో కవిత్వం రాస్తున్నారు.

కథా రచయిత, అనువాదకురాలు, యాక్టివిస్ట్.

పుట్టింది పోతారం, హుస్నాబాద్ మండ‌లం, సిద్ధిపేట జిల్లా. క‌వి, ర‌చ‌యిత‌. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో సీనియ‌ర్ స‌హాయ‌కుడు. ర‌చ‌న‌లు తొవ్వ‌, న‌డ‌క‌, మంక‌మ్మ‌తోట లేబ‌ర్ అడ్డా, వ‌రి గొలుసులు, బువ్వ‌కుండ‌(దీర్ఘ‌క‌విత‌)లాంటి క‌వితా సంక‌ల‌నాలు ప్ర‌చురించారు. వివిధ పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల నిర్మూలనా పోరాట సమితి ( KNPS), తెలంగాణ.

పుట్టింది బెజవాడలో. కవ‌యిత్రి, ర‌చ‌యిత్రి. జ‌ర్న‌లిస్టు. కొంత‌కాలం పాటు పిల్ల‌ల‌కు హిందీ పాఠాలు బోధించారు. వివిధ ప‌త్రిక‌ల్లో 12ఏళ్లపాటు ప్రూఫ్ రీడ‌ర్‌గా, స‌బ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు. 2008 నుంచి ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేస్తున్నారు.

వరంగల్ జిల్లా. కవి, రచయిత.

పూర్తి పేరు మహమ్మద్ అమ్జద్ అలి. స్వస్థలం ఖమ్మం. ఖమ్మం గవర్న్మెంట్  కాలేజీలో డిగ్రీ చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఎమెస్సి, ఎమ్మే, ఎఎల్ బి. మైసూర్ నుంచి సెరికల్చర్  డిప్లోమా. వృత్తిరీత్యా సౌది అరేబియాలో గత  ముప్పయ్ ఐదేండ్లకు పైగా ఉంటున్నారు. ప్రస్తుతం కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీ జెద్దా,  ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్ లో లీడ్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ /సీనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.

తెలుగు చదవడం, రాయడం చిన్ననాటి నుంచే హాబీగా ఉంది. మొదట్లో కవితలు, తర్వాత కథలు, నవలలు  ఆ తర్వాత అనువాదాలు (ఇంగ్లీష్, హింది, ఉర్దూ భాషలలోనుంచి కథలు), సాహిత్య, రాజకీయ వ్యాసాలు రాస్తున్నారు. ఇంతవరకు రెండు నవలలు, ఒక కథా సంకలనం, కవితా సంకలనం, ఉర్దూలోనుంచి అనువదించిన కథా సంకలనం, ప్రపంచ భాషల నుంచి కథా సంకలనం ప్రచురితమయ్యాయి.

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

కర్నూలు జిల్లా, ఆలూరు మండలం మొలగపల్లిలో నిరుపేద దళిత కుటుంబంలో 1955 జూలై 1న‌ పుట్టిండు. ఆయన అసలు పేరు సత్యం. విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా అరుణోదయ రామారావుగా పరిణామం చెంది పాటకు పర్యాయ పదంగా నిలిచిండు. చివరి శ్వాస వరకు ప్రజా కళలను ప్రజల కోసం దేశంలో విస్తృతంగా ప్రచారం చేయడంలో అరుణోదయ సాంస్కృతిక సేనానిగా ముందుకు నడిచిండు. హైదరాబాదులో మే 5, 2019న గుండె పోటుతో చనిపోయిండు.

పుట్టింది కరీంనగర్ జిల్లా, జగిత్యాల. కవి, చిత్రకారుడు. ఫొటో గ్రాఫర్. విరసం సభ్యుడు. జగిత్యాల జైత్రయాత్ర వెల్లువలో విప్లవోద్యమాన్ని ప్రేమించాడు. 1979లో విప్లవ రచయితల సంఘంలో సభ్యుడయ్యాడు. అద్భుతమైన సాహితీ సృజనచేసి, తెలుగు సాహిత్యంపై చెరగని ముద్రవేశాడు. రచనలు : ఎర్ర పావురాలు (1977), మంటల జెండాలు (1979), చురకలు (1981), రక్త రేఖ (1985), సంక్షోభ గీతం (1990), సిటీ లైఫ్ (1992), మరణం నా చివరి చరణం కాదు. తీవ్ర అనారోగ్యంతో 1993 జనవరి 12న చనిపోయాడు.

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

పత్రికా రచయిత, కవి. స్వగ్రామం-కడవెండి. ఉస్మానియాలో వృక్షశాస్త్రం, తత్వశాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వృత్తి- ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సమ్మక్క సారక్క తాడ్వాయి, ములుగు జిల్లా. సామాజిక సాహిత్య విద్యా పాఠశాల గా నడిపించే దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. తెలంగాణ ఇంటర్ విద్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సామాజిక కార్యకర్తగా, పోటీ పరీక్షల శిక్షకుడిగా పని చేస్తున్నారు.

పుట్టింది సిరిసిల్ల. తొమ్మిదో తరగతి వరకు చదివారు. కవి, నేత కార్మికుడు. పవర్ లూమ్ నేత వృత్తి కార్మికుడిగా పని చేస్తూ కవిత్వం రాస్తున్నారు. రచనలు: 1. 'రాత్ పైలీ దివస్ పైలీ', 2. 'సిరిసిల్ల నానీలు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'కామ్ గార్' కవిత్వం త్వరలో రానుంది.

కడప జిల్లా. కవయిత్రి, కథా రచయిత. ఎం.ఏ., ఎం.ఏ., ఎంఇడి., ఎల్.ఎల్.బి., పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివారు.
రచనలు : చెదిరిన పిచ్చుక గూడు (కథాసంపుటి), మా తుఝే సలాం (కథా సంపుటి), అనువాదాలు : అమలు కాని హామీల చరిత్ర, తలకిందులలోకం, హలో బస్తర్. కవితలు, పుస్తక పరిచయాలు, అనువాదాలు. కొన్ని వ్యాసాలు.

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

పుట్టింది ఖమ్మం జిల్లా. రాజకీయ విశ్లేషకుడు, వక్త, ఎమర్జెన్సీలో విప్లవ రాజకీయ రంగప్రవేశం. 1977-81 మధ్య ఎమర్జెన్సీ తర్వాత రాష్ట్ర విప్లవ విద్యార్థి ఉద్యమ (పీడీఎస్ యూ) నిర్మాతల్లో ఒకరు. 1981లో ఏలూరు జూట్ మిల్ కేంద్రంగా విప్లవ కార్మికోద్యమ ప్రవేశం. 1991లో నెల్లిమర్లలో జరిగిన చారిత్రాత్మక జూట్ కార్మికోద్యమాన్ని నిర్మించారు. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఇఫ్టూ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ముచర్ల గ్రామం, ఖమ్మం జిల్లా. 2014 నుంచి కవిత్వం రాస్తున్నారు. 'ఇప్పుడేది రహస్యం కాదు' కవితా సంపుటి ప్రచురించారు. 2019 విమల శాంతి పురస్కారం, 2019 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకున్నారు.

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

విజయవాడ. వృత్తి రీత్యా ఎల్ఐసిలో Administrative Officerని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

జననం: కరీంనగర్ జిల్లా గోదావరి లోయ ప్రాంతం. అసలు పేరు ఎం. శ్రీనివాసరావు. ఎంఎస్ఆర్, కరుణాకర్, ప్రభాకర్ అనే కలం పేర్లతో రచనలు చేశాడు. ఇంజనీరింగ్ చదివేటపుడు విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికి చేరువయ్యాడు. హైదరాబాద్ లోని వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.ఇ ఎలక్ట్రానిక్స్ రెండో సంవత్సరంలో విప్లవోద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్లాడు. పటాన్ చెరు పారిశ్రామిక వాడల్లో విప్లవకారుడిగా కార్మికోద్యమ నిర్మాణం చేశాడు. 3 సెప్టెంబర్, 1992న పోలీసులు పట్టుకొని కాల్చిచంపారు. తాను డైరీలో రాసుకున్న కవితలు, సినిమా రివ్యూలు, జ్ఞాపకాలను విరసం 'కాగడాగా వెలిగిన క్షణం' పేరుతో పుస్తకం ప్రచురించింది.

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర  బురుజు మాదిగపల్లె. కథా రచయిత్రి. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' కథా సంపుటి ప్రచురించారు. ఇప్పటివరకు అరవై కథలు రాశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

పుట్టింది జనగామ జిల్లా నర్మెట్ట. పలు సామాజిక ఉద్యమాలతో మమేకమై పనిచేస్తున్నరు. వృత్తి రిత్యా సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జనగామ పట్టణంలో పనిచేస్తున్నారు.

పుట్టిన ఊరు పెద్దపొర్ల, నారాయణపేట జిల్లా. విద్యార్థి సంఘ నాయకుడు. బీఎడ్, పీజీ (జర్నలిజం) చదివారు.

దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా హక్కుల రంగంలో పని చేస్తున్నారు. మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. డిగ్రీ కాలేజీలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పని చేశారు. వరంగల్ నివాసి. ప్రస్తుతం హైదరాబాదు లో ఉంటున్నారు.

పుట్టింది హన్మకొండ మండలం ఇనుగుర్తి. " గ్లోబల్ ఖడ్గం" సంకలనానికి సహ సంపాదకత్వం (2001), "దుఃఖానంతర దృశ్యం" కవితా సంపుటి (2014), ఈ కవితా సంపుటికి రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

కవి, రచయిత. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో బడగాం అనే మారుమూల పల్లె వ్యవసాయ కుటుంబంలో. చదువు: M.A.(English), M.A.(Telugu), B.Sc., B.Ed. వృత్తి: ఉపాధ్యాయ వృత్తి. రచనలు: 1) వలస పక్షుల విడిది - తేలినీలాపురం (2005) 2) కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా...(నానీ సంపుటి) (2010). ఇంకా వివిధ పత్రికల్లో వందకు పైగా వచన కవితలు, కొన్ని సాహితీ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా సాహిత్యంతో అనుబంధం.

కరీంనగర్ పట్టణంలో నివాసం. చేనేత జౌళి శాఖ లో ఉప సంచాలకులు గా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్ విశ్వ విద్యాలయం నుండి MA; MPhil. చెరబండరాజు నవల మీద MPhil, కట్టెపలక కవిత సంపుటి వెలువడింది. సాహిత్యం అధ్యయనం, కవిత్వం, వ్యాస రచనా, సాహిత్యంలో సమాజం అభిమాన విషయాలు.

మహిళా సంఘం కార్యకర్త. ఉపాధ్యాయిని. పుట్టిన ఊరు విశాఖపట్నం. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేసి, రాజీనామా చేశారు. నలభై రెండేళ్లుగా మహిళా సంఘం కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళల సమస్యలపై పనిచేయడం వలన కలిగిన అనుభవాలను రికార్డ్ చేస్తున్నారు.

పుట్టింది కర్నూలు. కవయిత్రి, కథా రచయిత, అధ్యాపకురాలు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎం.ఏ(తెలుగు), ఎం.ఫిల్ (కళ్యాణసుందరీ జగన్నాథ్ కథలు - ఒక పరిశీలన), ఎం.ఈడీ(అన్నామళై యూనివర్సిటీ) చదివారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. 13కథలు రేడియోలో ప్రసారమయ్యాయి. ప్రస్తుతం కర్నూలులో ఓ ప్రైవేట్ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె. అసలు పేరు డా. డి. శ్రీనివాసులు.  తెలుగు  అధ్యాపకుడు. వాల్మీకి పురం(వాయల్పాడు) ఎన్టీయార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

జ‌న‌నం: గుంటూరు జిల్లా, తెనాలి. నివాసం : హైదరాబాద్. ఎం.ఏ (హిందీ), ఎం. ఏ(ట్రాన్సలేషన్ స్టడీస్ ఇన్ హిందీ), బీఈడీ. 'జైనేంద్ర కుమార్ న‌వ‌ల‌ల్లో స్త్రీ పాత్రల మనో వైజ్ఞానిక చిత్రణ' అంశంపై ఎం.ఫిల్ చేశారు. 'కృష్ణా సొబతి& మమతా కాలియాల కథా సాహిత్యంలో స్త్రీ ల జీవితాలు' అంశంపై పీహెచ్‌డీ(ఉస్మానియా యూనివ‌ర్సిటీ) చేస్తున్నారు. సొంత‌ రచనలు : 1. పోరాడితేనే రాజ్యం, 2. ముగింపు మాటలా ..., 4. అభాగ్య జీవనాల భాగ్య నగరం. అనువాదాలు : 1. వైజ్ఞానిక భౌతికవాదం (రాహుల్ సాంకృత్యాయన్ ), 2. మధు పురి (రాహుల్ సాంకృత్యాయన్).

రాయటం కన్నా చదవటం ఇష్టం. రాయాలన్న తపన ఉంది. ఇంట్లో కాని, వీధిలో కాని తగిన ప్రోత్సాహం లేక రాసినవి కూడా దాసుకున్న.

వృత్తి, ప్రవృత్తి పిల్లల కు పాఠాలు చెప్పటం, వాళ్ళు చెప్పే కబుర్లు, జోక్స్, పాటలు ఎంజాయ్ చేయటం.
ప్రకాశం జిల్లా పౌరహక్కుల, ఉపాధ్యాయ, గుళ్ళకమ్మ రచయితల, చైతన్య మహిళ సంఘం జిల్లా బాధ్యురాలిగా కొంత కాలం.

రచనలు:- అరుణతార లో వాడగోడు (యదానిక), దేవరగద్దె, నెత్తుటి నీరెండకు చేయడ్డు పెట్టుకొని కథలు, అర్ధరాత్రి ప్రయాణికుడు, పృథ్వి అమ్మల కోసం వచ్చేయి కవితలు, శ్రీపాద, కన్నగి మొదలగు పుస్తకాల పరిచయం.
మాతృక లో, కలల్ని ఇంకిపోనియ్యకు కథ, వృత్తి కి సంబంధించిన కొన్ని స్కిట్లు, పాటలు.
మహిళా మార్గం లో ఓ గల్పిక, ఓ కవిత, ఓ కథ.
'ఆమె చూపు ఎర్రజెండా వైపే', వేటపాలెం వెంకాయమ్మ జీవితం పుస్తకం. రెడీగా ఉన్న మరో మూడు కథలు.

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

కాకినాడలో నివాసం. వృత్తి రీత్యా వైద్యురాలు. రంగరాయ మెడికల్ కాలేజీ లో ఫాకల్టీగా పనిచేస్తున్నారు. 'నవ నవలా నాయికలు' పుస్తకం లో రాసిన వ్యాసంతో మొదటి సారి అచ్చు లోకి అడుగు పెట్టారు. 'చినుకు' మాసపత్రిక, 'కౌముది', 'సారంగ', 'సంచిక' వెబ్ మాగజైన్స్, 'విపుల'లో కథలు  ప్రచురితమయ్యాయి. అమెజాన్ లో "Interludes" అనే నవలిక (ఇంగ్లీషు) ఉన్నది. మానవ జీవితంలోని వైరుధ్యాల మధ్య దూరం తగ్గించే మార్గంలో కథ పాత్రలను అన్వేషించే ప్రయత్నంలో ఉన్నారు.

జననం: రంగారెడ్డి జిల్లా. సాహిత్య విద్యార్థిని, కథా రచయిత్రి.  'శ‌త‌పత్ర మంజ‌రి' అనే క‌లం పేరుతో ర‌చ‌న‌లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది కథలు రాశారు. బీబీసీలో ఫ్రీలాన్సర్. ప‌రిశోధ‌న: 'నవల - కథానిక' అనే అంశంపై. తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

రచయిత్రి

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

జ‌న‌నం: విజయనగరం జిల్లా పార్వతీపురం. విరసం స‌భ్యుడు. త‌న‌ను తాను వ్య‌క్తీక‌రించుకునే సాధ‌నంగా క‌విత్వం త‌న జీవితంలో భాగంగా మారింద‌ని న‌మ్మిన క‌వి. ఇప్పటివరకు 'వెన్నెలదారి', 'రెప్పల వంతెన', 'కాగుతున్న రుతువు' కవితా సంపుటాలు వచ్చాయి.

స్వగ్రామం మద్దికుంట, కరీంనగర్ జిల్లా. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు సాహిత్యం). అచ్చయిన తొలి రచన: "మన జాతికే వెలుగంట(క‌విత‌). రచనా ప్రక్రియలు: పద్యం, వచన కవిత్వం , వ్యాసం, పాట, కథ, నానీలు. ముద్రితాలు: 1."మేలుకొలుపు"వచన కవితాసంపుటి, 2. చదువులమ్మ శతకం, 3.పల్లె నానీలు, 4."ఎర్రగాలు వచన కవిత్వం. 5."ఆరుద్ర పురుగు"వచన కవిత్వం. సంపాదకత్వం: 1."నల్లాలం పూలు(బడి పిల్లల కవిత్వం) 2."సోపతి" ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండుగ. 3."ఎన్నీల ముచ్చట్లు"కవితా గాన సంకలనాలు -10. ప్ర‌స్తుతం తెలుగు భాషోపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నారు.

కవి, రచయిత. జర్నలిస్ట్, సామాజికోద్యమాల కార్యకర్త. ట్రెయినర్, అకడమిక్ కౌన్సిలర్, సామాజిక తత్వవేత్త.

పుట్టింది కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా). కవయిత్రి, అధ్యాపకురాలు.  ఎం.ఏ, ఎం.ఎడ్ చదివారు. పాలకుర్తి (జనగామ జిల్లా) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పి.జి.టిగా పనిచేస్తున్నారు.

 

 

రచయిత, జర్నలిస్టు.

జ‌న‌నం: కార్మూరివారి పాలెం, గుంటూరు జిల్లా. 1967 నుంచి వివేక‌వ‌ర్ధిని డిగ్రీ కళాశాల‌(హైద‌రాబాద్‌)లో ఆంగ్లోప‌న్యాస‌కులుగా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ర‌చ‌న‌లు: 'ర‌క్తం సూర్యుడు', 'ఆసుప‌త్రి గీతం', 'మోహ‌నా ఓ మోహ‌నా', 'అంతర్జ‌నం'... 25 క‌వితా సంక‌నాలు ప్ర‌చురించారు. 1970-72మ‌ధ్య రెండేళ్ల పాటు 'వేకువ' అనే సాహిత్య ప‌త్రిక న‌డిపారు. కేంద్ర సాహిత్య అకాడ‌మీ, స‌ర‌స్వ‌తీ స‌మ్మాన్ అవార్డులు పొందారు.

రచయిత్రి, అనువాదకురాలు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సంపాదకురాలు. మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా బాధిత సమూహాల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పర్యావరణ విధ్వంసానికి దారితీసే యురేనియం, వ్యవసాయ విధానాల వంటి సమకాలీన రాజకీయ అంశాలపై మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలపై నాలుగు దశాబ్దాలుగా  ఉద్యమిస్తున్నారు. ఆయా సమస్యలపై  వివిధ పత్రికలలో కాలమిస్టుగా విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు.  వాటిని 'ప్రవాహం', 'రైతుల ఆత్మహత్యలు-మనం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు. స్త్రీలు ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలపై 'సవాలక్ష సందేహాలు' పుస్తకానికి కె.లలితతో, 'స్త్రీవాద రాజకీయాలు - వర్తమాన చర్చలు' పుస్తకాన్ని ప్రొఫెసర్ రమా మెల్కోటెతో కలిసి సంపాదకత్వం వహించారు. భాషా సింగ్ రచించిన ‘UNSEEN’ పుస్తకాన్ని 'అశుద్ధ భారత్'గా, ప్రొఫెసర్ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘DALITS AND THE MAKING OF MODERN INDIA' ని 'ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు' పేరిట తెలుగులోకి HBT కోసం అనువదించారు. 'కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్' కమిటీ తరపున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల జీవన భద్రత కోసం పని చేస్తున్నారు.

పుట్టింది నల్లగొండ జిల్లా. కవి, అధ్యాపకుడు. విరసం సభ్యుడు. రచనలు: 'లాంగ్ మార్ఛ్', 'దండకారణ్యం ఒక ఆకుపచ్చని కల'

కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి 1931 డిసెంబర్ 26 న అప్పటి గుంటూరు జిల్లా రంగశాయపుర అగ్రహారంలో పుట్టారు. కన్నతల్లి తెలికేపల్లి వెంకమ్మ ,దత్తు తీసుకొని విద్యాబుద్ధులు చెప్పించిన తల్లి కేతవరపు సావిత్రమ్మ. హైస్కూల్ చదువు వినుకొండలో ఇంటర్మీడియేట్ గుంటూరు లో హిందూ కాలేజీలో చదివి కొంతకాలం సత్తెనపల్లిలో టీచర్ గా పనిచేసి అక్కడి నుండి విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎ ఆనర్స్ పూర్తి చేసి 1954 లో గుడివాడ ANR కాలేజీలో లెక్చరర్ గా చేరారు . 1957 లో ఉద్యోగం మానేసి ఉస్మానియావిశ్వవిద్యాలయం లో బిరుదురాజు రామరాజుగారి పర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పంపై డాక్టరేట్ పట్టా పొందారు. 1960 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు. 1968 లో వరంగల్లు పిజి సెంటర్ కు బదిలీ అయివచ్చి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగువిభాగం అభివృద్ధికి నిలబడ్డారు. ఉద్యోగజీవితం మరో అయిదారు నెలల లో ముగుస్తుందనగా రోడ్డు ప్రమాదంలో 1991 అక్టోబర్ 28 న ఆయన జీవితమే ముగిసింది.

ఇంటర్మీడియట్ చదువ్వుతున్న కాలంలోనే ఆయనలో సాహిత్య సృజనవిమర్శన శక్తుల వికాసం మొదలైంది. జంధ్యాల పాపయ్యశాస్త్రి ప్రభావంతో పద్యాలు వ్రాయటం మొదలు పెట్టారు. విశ్వనాథ సాహిత్య అభిమాని అయినారు. మహాభారతం వంటి సంప్రదాయ సాహిత్యాన్ని ఎంత గాఢంగా అధ్యయనం చేశారో విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని ఎంత పారాయణ చేశారో ఆధునిక సాహిత్యాన్ని కూడా అంతశ్రద్ధగా చదివారు. 1968 లో వరంగల్లుకు తిరిగిరావటం ఆయన జీవితంలో పెద్ద మలుపు. అక్కడనుండి మార్క్సిస్టు తత్వశాస్త్ర అధ్యయనం , అవగాహన ఆయన సాహిత్య కృషిని విప్లవాత్మకంగా మార్చాయి. సమాజ సాహిత్య సంబంధాలగురించి రాజకీయార్థిక దృక్పథంతో చేస్తున్న చింతనను సంభాషణగా మార్చటానికి 1986-87 విద్యాసంవత్సరం లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారి జాతీయఉపన్యాస కార్యక్రమం ప్రాజెక్ట్ కింద దేశంలోని వివిధ విశ్వవిద్యా లయాలలో ప్రసంగించటానికి ఎంపిక అయిన సందర్భాన్నిచక్కగా ఉపయోగించుకున్నారు. అధ్యయనం, బోధన, విమర్శన, రచన ఆయన ఆచరణ. పరిశోధనలో నూతన సత్యాలకై అన్వేషించే జిజ్ఞాస ఆయనది. వందకు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. మెదడులో సుళ్ళు తిరిగే ఆలోచనలను కాగితం మీద పెట్టి చూసుకొనటం సమానభావాలు, స్పందనా లక్షణం ఉన్న సాహిత్య జిజ్ఞాసువులైన స్నేహితులతో సంభాషణలో నిగ్గు తేల్చుకొనటం ఆయన ప్రవృత్తి.

ఆనందచేతన(1958), అంగహేల, శత్రుంజయము (1963) గీతాంజలి అనువాదం(1962) శాస్త్రి గారు బ్రతికిన కాలపు కవిత్వ రచనలు. ఆయన జీవితకాలంలో వచ్చిన విమర్శ గ్రంధాలు నైమిశము(1961), సమీక్షణ (1963) తిక్కన కావ్య శిల్పం ( 1973),భారతము- తత్వ దర్శనము (1976) తిక్కన హరిహరనాథ తత్వము (1976) పోతన్నగారి వైచిత్రి (1987).

మరణానంతర ప్రచురణలు- ఒకే ఇద్దరం (1996) చిచ్చేతన (2006) శ్రీకృష్ణ దూత్యము మరికొన్ని ముక్తకాలు- ఖండికలు( 2009) కవిత్వం. మళ్ళీ కన్యాశుల్కం గురించి (1992), నాటక విశ్లేషణ (1993), విశ్వనాథ వైఖరి( 1994),మహిళా సమాజవాడ సాహిత్యం (1995) అభ్యుదయవాద సాహిత్య విమర్శనా దృక్పథం (1996)కవిత్వం- సమాజం క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ (1998) భారతీయ సాహిత్య శాస్త్రం - భిన్న దృక్పథాలు (1999)నాచన సోముడు (2000) తెలుగు కవిత ఉద్యమాలు (2001) భాషా సాహిత్యాలు - సామాజిక భావనలు (2002) పురాణేతిహాసాలు - విశేష విశ్లేషణలు (2003) సంఘర్షణ - సంవాదం (2004) దృష్టి - దృశ్యం (2005) కావ్య జిజ్ఞాస (2007)సాహిత్య సామాజికతా వాదం - కొన్ని ప్రతిపాదనలు (2008) ఒక రత్నము - ఒక మంత్రము , శృంగార నైషధ కావ్య జిజ్ఞాస( 2010) సాహిత్య సంభావన( 2011)శాస్త్రీయ సమీక్షలు - ముందుమాటలు( 2013) కవిత్వం : అనుభవం - అవగాహన( 2014) నవలాలోకనం (2015) విమర్శ గ్రంధాలు.

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారామపురం. ఎం.ఏ ( పొలిటికల్ సైన్స్)  చదివారు. రచయిత్రి, సోషల్ ఏక్టివిస్ట్. స్త్రీ వాద పత్రిక 'భూమిక' ఎడిటర్. 2000 లో తహసీల్దార్ ఉద్యోగానికి రాజీనామా చేసి భూమికలో పూర్తి కాలం పని చేస్తున్నారు. మహిళల కోసం 24/7 హెల్ప్ లైన్ (టోల్ ఫ్రీ నం # 18004252908) నడుపుతున్నారు.

‘మన మంచి పుస్తకం’ యూ ట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకుడు. హైదరాబాద్‌ హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నారు.

పుట్టింది హైదరాబాద్అ.  బాల్యం , విద్యాభ్యాసం విజయవాడలో గడిచాయి. 1977 లో విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో బి.ఎ. డిగ్రీ చదివారు. వృత్తిరీత్యా విలేకరి. ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి. ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యంలోనూ ఒక ప్రత్యేక ముద్ర కోసం కృషి చేశారు. 1978 లో ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక శాఖలో కెరీర్ ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ప్రచురణ , ప్రసార, అంతర్జాల మాధ్యమాల్లో సబ్ ఎడిటర్ , ప్రోగ్రామ్ ప్రెజెంటర్ , కంటెంట్ ఎడిటర్ స్థాయిలో పనిచేశారు. రచనలు: సందిగ్ధ సంధ్య (1988), నడిచేగాయాలు(1990), బాధా శప్తనది(1994), మల్టీనేషనల్ ముద్దు(2001), కథాసంపుటాలు: శత్రుస్పర్శ (1998), ఎచటికి పోతావీ రాత్రి(2019). 2000 లో అభివృద్ధి రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో జండర్, అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ గా  పని చేశారు. అన౦తరం అర్బన్ డెవలప్ మెంట్ , వెలుగు ప్రాజెక్టులకు న్యూస్ లెటర్ ఎడిటర్ గా, కొంతకాలం అధికార భాషా సంఘంలో వ్యవసాయ , పాలనా అంశాలకు సంబంధి౦చిన నిఘంటువు రూపకల్పనలో పాత్ర వహించారు. ప్రస్తుతం జండర్ సమాచార రంగాల్లో శిక్షకురాలుగా , పాఠ్యా౦శాల రచయితగా , అనువాదకురాలుగా వున్నారు. గ్రీన్ థాట్ పేరుతో thematic poetry వీడియోలు రూపకల్పన చేస్తున్నారు. కవుల కవిత్వంతో ఫోటోషాప్ , గ్రాఫిక్ బొమ్మలు visul poetry అనే వినూత్న ప్రక్రియ చేపట్టి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు.

సూర్యాపేట. అధ్యాపకుడు. బీఎస్సీ, బీఈడీ. ఎంఏ(తెలుగు సాహిత్యం) చదివారు. ప్రాథమిక విద్య దశ నుండి నాన్నపాఠశాలలో తెలుగు బోధించడం వల్ల తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. కళాశాల దశ నుండీ అభ్యుదయ దృక్పథం కలిగిన వారి పరిచయం వల్ల ప్రగతిశీల సాహిత్యంపట్ల ఆసక్తి. కొన్ని కవితలు, పుస్తక సమీక్షలు రాశారు. అవి అధ్యాపక జ్వాలలో ప్రచురితమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో పనిచేసి రిటైర్ అయ్యారు. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్. 360 డిగ్రీస్‘ పేరుతో వ్యాస సంపుటి ప్రచురించారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల వారీగా సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్ర రాస్తున్నారు.

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

మర్లపాలెం, గన్నవరం మండలం కృష్ణా జిల్లా. కవయిత్రి. మనసు స్పందించినప్పుడల్లా అక్షర ప్రయాణంలో ఆనంద విహారం చేయడం ఇష్టం. కవిత్వం వివిధ పత్రికల్లో అచ్చయింది. సాంస్కృతీ సమాఖ్య సంస్థ నుండి ఉగాది వెలుగు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుండి జ్ఞాన జ్యోతి, ఉషోదయ సాహితీ వేదిక నుండి గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం, నెల్లూరు గ్రీన్ ఇండియా ట్రస్ట్ నుంచి అడవి బాపిరాజు స్మారక ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.

పుట్టింది న‌ల్ల‌గొండ జిల్లా న‌క్రేక‌ల్‌. పాత్రికేయుడు. విర‌సం స‌భ్యుడు. రచనలు: క‌ల‌త నిద్దురలో (క‌వితా సంక‌ల‌నం), అన‌గ‌న‌గా అడ‌విలో - హిడ్మే మ‌రికొంద‌రు (వ్యాస సంక‌ల‌నం).

పుట్టింది విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. ఎం.ఏ, బి.ఇడి చదివారు. కవి, కథా రచయిత, అధ్యాపకుడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైరయ్యారు. ప్రస్తుతం పార్వతీపురంలో వుంటున్నారు. 'ఏటిపాట', 'ఒకరాత్రి రెండుస్వప్నాలు' (కథా సంపుటాలు), 'నది నిదానం చేసాక', 'ఎగిరిపోతున్న పిట్టల కోసం'(కవితా సంపుటాలు), 'నాగేటి చాలుకు నమస్కారం', 'నాగలి' (దీర్ఘ కవితలు),'పాడుదమా స్వేచ్ఛాగీతం', 'ప్రియ భారత జననీ'(గేయ సంపుటాలు), 'నాగావళి అలల సవ్వడి', 'ఉన్నమాట' (పద్య సంపుటాలు), 'మనసు పలికే' (గజల్ గీతాలు) ప్రచురించారు. మిత్రులతో కలిసి 'స్నేహ కళాసాహితి'(1992 ) సంస్థను నడుపుతున్నారు.

కవి, రచయిత. సామాజిక కార్యకర్త.

పుట్టిన ఊరు వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌ స్టేషన్. కవయిత్రి, ఉపాధ్యాయురాలు. M.Sc (Physics), M.A.(Sociology), B.Ed. చదివారు. రచనలు : ఆమె తప్పిపోయింది(కవితా సంపుటి). స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పనిచేస్తున్నారు. వివిధ పత్రికలు, వెబ్ మేగజీన్ లలో కవిత్వం అచ్చయింది.

కరీంనగర్ జిల్లా వాసి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కవి, రచయిత, గాయకుడు. "మట్టి సరిగమలు" (కవిత్వం), "నెత్తుటి గాయాలు" తెలంగాణ ఉద్యమ గేయాల సీడీ, కొన్ని కథలు, వ్యాసాలు ప్రచురించారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు.

హైదరాబాద్ లో బీ. కామ్ చదివారు. ప్రస్తుతం Synchrony Financial కంపనీలో సీనియర్ కస్టమర్ సర్వీస్ రిప్రెసెంటేటివ్ గా పని చేస్తున్నారు. కవిత్వం, ముఖ్యంగా ప్రేమ కవిత్వం ఆమె ఆసక్తి.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

పుట్టింది జనగామ జిల్లా లింగాల ఘన్పూర్‌ మండలం నెల్లుట్ల. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఎం.ఎస్సీ., ఎం. ఏ. బి.ఎడ్. చదివారు. పిహెచ్‌డి చేస్తూనే (భౌతిక శాస్త్రం) స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇరవయేళ్లుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ లో పని చేస్తున్నారు. కవిత్వం చదవడం, రాయడం అభిరుచి. సమాజంలో ప్రగతిశీల భావజాల వ్యాప్తికి కృషి. పీడన లేని నూతన సమాజం ఆవిర్భవించాలని ఆకాంక్ష. బాలికలు, స్త్రీల సమస్యల పట్ల అవగాహకు కృషి చేస్తున్నారు. మానవీయత, స్నేహపూర్వకమైన మానవ సంబంధాలు నెలకొనాలనే అభిలాష.

రచయితగా, ప్రజాగాయకుడిగా తెలంగాణ సమాజానికి సుపరిచితుడు గూడ అంజయ్య. ఆయన ఆదిలాబాదు జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో గూడ లక్ష్మయ్య, లక్ష్మమ్మ దంపతులకు నవంబరు 1న, 1954లో జన్మించారు. హైదరాబాదులో బీఫార్మసీ చదివి, ఉట్నూరులో ఫార్మసిస్టుగా ప్రభుత్వ ఉద్యోగం లో చేరారు. అంజన్న రాసిన 'ఊరు మనదిరా' పాట దేశవ్యాప్తంగా గ్రామీణులను ఉర్రూతలూగించింది. ఆ పాట పదహారు భాషల్లోకి అనువాదమైంది. 'అయ్యోనివా నువ్వు...అవ్వోనివా' అంటూ ఆంధ్ర పెట్టుబడి వర్గాల మీద రాసిన పాట తెలంగాణ ఉద్యమంలో భావసంచలనం రగిలించింది. ఇలాంటి ఎన్నో గొప్ప పాటలు విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమంలో యువతను ముందుకు నడిపించాయి. పొలిమేర (నవల), దళిత కథలు(కథా సంపుటి) ప్రచురించారు. జూన్ 21, 2016లో రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని స్వగ్రుహంలో అనారోగ్యంతో తదిశ్వాస విడిచారు.

కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. జర్నలిస్టు. రచనలు: 1. నైఋతి ఋతుపవనాల కాలమిది!(అనువాద కవిత్వం), 2. తుఫానులకెదురు నడవరా!(అనువాద కవిత్వం)

పుట్టింది ప్రకాశం జిల్లా జె. పంగులూరు. కవి, అధ్యాపకుడు. ఎంఏ (ఇంగ్లిష్)- అన్నామలై యూనివర్సిటీ, ఎంఏ(హిస్టరీ)- నాగార్జున యూనివర్సిటీ, ఎంఈడీ -(అన్నామలై యూనివర్సటీ) చదివారు. రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం...(2018), అద్దంకి సాహితీ స్రవంతి బాధ్యుడిగా ఉన్నారు. మేదరమెట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వివిధ పత్రికల్లో కవితలు అచ్చయ్యాయి.

ఊరు యర్రగొండ పాలెం, ప్రకాశం జిల్లా.  కథా రచయిత, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్.  నాగార్జున యూనివర్సిటీలో M.A. (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనకేషన్) చేశారు. తెలుగు వెలుగు, బాల భారతం పత్రికల్లో కొంతకాలం ఆర్టిస్ట్ గా పని చేశారు. కథలకి, పుస్తకాలకి ముఖచిత్రాలు గీసారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా, సినిమాల్లో రచయితగా పని చేస్తున్నారు. ఇప్పటికి 13 కథలు, కొన్ని వ్యాసాలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి.  తన కథ 'కేరాఫ్ బావర్చి' కథా సాహితీ వారి ' కథ19 ' లో వచ్చింది. మంచి పేరు తెచ్చింది.

ఖమ్మం జిల్లా. అధ్యాపకురాలు, కవయిత్రి, కథా రచయిత. ఎం.ఏ(హిందీ) చదివారు. 30 ఏళ్లగా ఖమ్మం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో హిందీ అధ్యాపకురాలిగా పనిచేసి  2010 లో పదవీ విరమణ పొందారు. కథలు, కవితలు రాయడం  ప్రవృత్తి.

పూర్వపు నల్లగొండ జిల్లా. కవి, కథకుడు, విమర్శకుడు. అధ్యాపకుడు. రచనలు: మా నాయిన (2006), నల్ల చామంతి (2017), వెలుతురు మొలకలు(2019) కవితా సంకలనాలు ప్రచురించారు.

చారిత్రక పరకాల పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో గల రంగయ్యపల్లి స్వగ్రామం. రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు. ఎంఏ(ఎకనామిక్స్), ఎంఈడీ కాకతీయ యూనివర్సిటీలో చదివారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి, సాంఘిక శాస్త్ర బోధన. సమకాలీన అంశాల మీద తక్షణ స్పందనగా "చిలువేరు చురకలు" వారం వారం రాస్తూ సమాజాన్ని మేల్కొలపాలనే సామాజిక బాధ్యతతో కవిత్వ ప్రయాణం. "అమ్మచెక్కిన అక్షరం" తొలి కవితా సంపుటి. విద్యా విధానం మీద పది వ్యాసాలు, నాలుగు కథలు, వందకు పైగా కవితలు నిరంతర కవిత్వ సాగు. ప్రజాతంత్ర భావజాలంతో మమేకమవుతూ ప్రజా పోరాటాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

అస‌లు పేరు బ‌ద్ధం భాస్క‌ర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టాడు. హైద‌రాబాద్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేశాడు. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. 'న‌న్నెక్క‌నివ్వండి బోను'తో క‌వితాకాశంలో సూర్యుడిలా పొడుచుకొచ్చాడు. విర‌సం వ్య‌వ‌స్థాప‌క కార్య‌వ‌ర్గ స‌భ్యుడు. 1971-72లో విర‌సం కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాడు. శ్ర‌మ‌జీవుల జీవితాల‌పై ఎన్నెన్నో పాట‌లు రాశాడు. విర‌సం మీద ప్ర‌భుత్వం బ‌నాయించిన సికింద్రాబాద్ కుట్ర‌కేసులో ముద్దాయి. క‌వితా సంపుటాలు: 'దిక్సూచి', 'ముట్ట‌డి', 'గ‌మ్యం', 'జ‌న్మ‌హక్కు'. న‌వ‌ల‌లు: ప్ర‌స్థానం, మా పల్లె. గంజినీళ్లు(నాటిక‌), చిరంజీవి, మ‌రికొన్ని క‌థ‌లు రాశారు. . ప్ర‌భుత్వం చెర‌బండ‌రాజుని నిరుద్యోగానికీ, అనారోగ్యానికీ గురిచేసి బ‌లితీసుకుంది. మెద‌డు క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు.

 

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

పాక జయమ్మ. పుట్టింది నల్లగొండ జిల్లా, హాలియా మండలం, రంగుండ్ల గ్రామం. అధ్యాపకురాలు. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మహిళా మార్గం' వర్కింగ్ ఎడిటర్. కుటుంబం నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్లపల్లి మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి వలస వచ్చింది. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మండలం, వెల్జెర్లలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

పుట్టింది, పెరిగింది హైదరాబాద్. అశోక యునివర్సిటీ నుండి లిబరల్ స్టడీస్ లో పోస్ట్-గ్రాజుయెట్ డిప్లొమా పొందింది. ఆర్కిటెక్ట్ గా పని చేస్తోంది. చిన్నప్పటినుండీ చదవడం, రాయడం అంటే ఆసక్తి. 2016 లో తన కవిత్వ సంపుటి 'Quill' ప్రచురించింది.

జి.ఎన్ సాయిబాబా అమలాపురంలో పుట్టి హైదరాబాద్‌లో చదువుకున్న‌ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విప్లవ మేధావి. వైద్యశాస్త్ర పరిభాషలో 90 శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ, సునిశితమైన మేధతో తెలుగు సీమలోనూ, దేశవ్యాప్తంగానూ ప్రజా ఉద్యమాలకు బుద్ధిజీవుల సంఘీభావాన్ని సమీకరించడంలో అగ్రభాగాన ఉన్నారు. భారతీయాంగ్ల నవలల మీద పి ఎచ్ డి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్. మధ్య భారత అరణ్యాలలో భారత ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ దమనకాండను నిరసించినందుకు తప్పుడు కేసులో యావజ్జీవ శిక్షకు గురై ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైలులో అండా సెల్ లో ఉన్నారు.

కవి, రచయిత, విమర్శకుడు. నాటక కర్త. విప్లవ రచయితల సంఘం సభ్యుడు. రచనలు: 1. కాలం (కవిత్వం), 2. అంటరాని వసంతం(నవల), 3. నేనేమడిగానని(కథలు), 4. తెలుగు నాటక రంగ మూలాలు, 5. ఆఖరి మనిషి అంతరంగం.

మానవ హక్కుల వేదిక కార్యకర్త

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

జననం: కర్నూలు జిల్లా. కవి, రచయిత, కథకుడు, విమర్శకుడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకార శాఖ లో డిప్యూటీ రిజిస్ట్రార్.  ఇప్పటి వరకు నాలుగు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, మూడు కథా సంపుటాలు, సాహితీ విమర్శ వ్యాసాలు ప్రచురించారు. కథలోనైనా, కవిత్వం అయినా రాయలసీమ గ్రామీణ ప్రాంత జీవితాన్ని బలంగా చిత్రించడానికే ప్రాధాన్యత యిస్తారు. అభ్యుదయ, బహుజన వాద మేలుకలయికగా సాహిత్య సృజన చేస్తున్నారు.

కవితా సంపుటాలు: 1. లోగొంతుక (2000), 2. దున్నేకొద్దీ దుఖ్ఖం (2005), 3. కొన్ని రంగులూ ఒక పద్యం (2010), 4. చినుకు దీవి (2016). దీర్ఘ కవితలు: 1. నదీ వరదా మనిషి (2009), 2. హంద్రీ గానం (2015). కథాసంపుటాలు:  1. గరుడ స్థంభం (2005), 2. చిలకలు వాలిన చెట్టు (2010), 3. దేవరగట్టు (2017).

పుట్టింది బొమ్మాయిపల్లి, నల్లగొండ జిల్లా(పూర్వపు). రచయిత, జర్నలిస్టు, అనువాదకుడు, రైతు. వివిధ పత్రికల్లో ఫ్రెంచ్ అనువాదాలు ప్రచురితమయ్యాయి.   ప్రస్తుతం  కృతి వ్యవసాయం చేస్తున్నారు.

పుట్టింది కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి గ్రామం. కవి. కోపరేటివ్ విద్యుత్ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రచనలు: చిలుక రహస్యం, తారంగం, ఒకరోజు పది గాయాలు, పిడికెడు కన్నీళ్లు దోసెడు కలలు, పాతాళ గరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా డాట్ కామ్, బొడ్డుతాడు, తల్లి కొంగు, రాజపత్రం, చెట్టుని దాటుకుంటూ, పస, ఊరు ఒక నారు మడి.. 14 కవితా సంపుటాలు, 'వైఫణి'( నైపుణ్యం) కథల సంపుటి ప్రచురించారు.

కవయిత్రి, కథా రచయిత్రి. పుట్టింది దామరంచె పల్లె, వరంగల్ జిల్లా. కాకతీయ యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో ఎం. ఏ, ఎం. ఫిల్ చేశారు. 'మట్టిపూల రచయిత్రుల వేదిక' వ్యవస్థాపక సభ్యురాలు. రచనలు: నల్లరేగటిసాల్లు (2006), సంగతి (తమిళ్‌ నుండి తెలుగు), కైతునకల దండెం (2008), అయ్యయ్యో దమ్మక్క (2009), చంద్రశ్రీ యాదిలో... (2013),
రాయక్క మాన్యం (2014). తెలంగాణా సెక్రటేరియట్ లో పని చేస్తున్నారు.

పుట్టింది ఉమ్మడి నల్గొండ జిల్లా, దత్తాయపల్లి(ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా). పరిశోధకుడు, కవి, గాయకుడు.
M.P.A, M.A చదివాడు. వివిధ పత్రికలు, అంతర్జాల పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

వరంగల్. కవి, రచయిత, అధ్యాపకుడు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. 'సృజన' ఆధునిక సాహిత్య వేదికను నిర్వహించే 'సాహితీ మిత్రుల'తో కలసి పనిచేశారు. 1969లోనే 'ఫ్రీ - ఫ్రాంక్ వర్స్ - ఆధునికత', 'ఆధునికత - తెలుగు వచన కవిత' లాంటి లోతైన విమర్శ వ్యాసాలు రాశారు. 'జేసీ' పేరుతో 1980లలో అద్బుతమైన కవిత్వ విమర్శ వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలన్నీ 1991లో 'కవిత్వం - గతితార్కికత' పేరుతో ప్రచురించారు. సునిశిత విమర్శతో మూడు దశాబ్దాల పాటు యువతరాన్ని ప్రభావితం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ఫ్రొఫెసర్ గా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం రిటైరయ్యారు. అనంతరం అమెరికా వెళ్లారు. 30 మే, 2021న బ్రాంకైటిస్ తో అక్కడే చనిపోయారు.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

జననం: ఖమ్మం జిల్లా, గార్ల మండలం పెద్ద కిష్టాపురం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. కవయిత్రి. రచనలు: కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం), సుదీర్ఘ హత్య-2009(కవిత్వం), ఆత్మాన్వేషణ -2011(కథలు), అగ్ని లిపి-2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం), జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు), సంపాదకత్వం: పరివ్యాప్త-2007(స్త్రీవాద కవిత్వం), రుంజ - 2013(విశ్వకర్మ కవుల కవిత్వం), ఖమ్మం కథలు - 2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు), అక్షర పుష్పాలు-భావ సౌరభాలు - 2016 (ఖమ్మం బాల కవుల రచనల సంకలనం), ఓరు - 2017(జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన). పనిచేసిన సాహితీ సంస్థలు: 'మట్టిపూలు', 'రుంజ', 'అఖిల భారత రచయిత్రుల సంఘం', 'దబరకం', 'తెలంగాణ విద్యావంతుల వేదిక'. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు చేస్తున్నారు.

కవి, రచయిత, అనువాదకుడు. మొదటి కథ 'దోమాయణం' లీలా రాఘవయ్య గారి 'జ్యోతి' 1989 దీపావళి ప్రత్యేక సంచికలో అచ్చవడంతో రచనా వ్యాసాంగం మొదలైంది. ఇప్పటికి రెండు తెలుగు నవలు (‘సహజీవనం’, ‘లాకర్ నెంబరు 112’) (విహంగ, కౌముది) వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. తమిళ రచయిత్రి శివ శంకరి నవల 'ది బిట్రేయల్', అపూర్వ పురోహిత్ 'ఓ లేడీ యు ఆర్ నాట్ ఎ మాన్' అనే పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. 'పియర్సన్ ఇండియా' వారి ఐదు పర్సనాలిటీ డెవలప్మెంట్(రిచర్డ్ టెంప్లార్ రాసినవి) పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశారు. అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగినా, రావాల్సినంత పేరు రాని, దేశ విదేశాల్లోని స్త్రీ మూర్తుల గురించి తొమ్మిది వ్యాసాలు “విహంగ” వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యాయి. ఇప్పటి దాకా పందొమ్మిది కథలు రాశారు. ఒక ఇంగ్లిష్ సస్పెన్స్ నవల రాస్తున్నారు. రెండు తెలుగు కవిత్వం పుస్తకాలు అచ్చు వేశారు. మరొక తెలుగు కవిత్వం పుస్తకం, ఒక ఇంగ్లిష్ కవిత్వ పుస్తకం ప్రింట్ కావాల్సి వుంది.

స్వస్థలం: కడపజిల్లా ముద్దనూరు మండలం, యమవరం గ్రామం. కవి, విమర్శకుడు. తెలుగు సాహిత్యంలోె ఎం.ఏ., పీ హెచ్ డీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ 2013 లో పదవీ విరమణ చేశారు. రచనలు:  'మరోప్రపంచం కోసం'(1978),  'దివ్యదృష్టి', 'జ్వలనమ్', 'తుఫాను ముందటి ప్రశాంతి', 'ఈ కన్నీటికి తడిలేదు', 'క్షతగాత్రం', 'మగ్గం బతుకు', 'అవిశ్రాంతం' సంపుటాలు వచ్చాయి. విమర్శకుడిగా 8 పుస్తకాలు. 'కవిత్వం ఓ సామాజిక స్వప్నం'(మొదటి సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక సంస్కారం'(రెండవ సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక సత్యం'(మూడవ సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక చైతన్యం'(నాల్గవ సంపుటి. )అవగాహన-1 , మూడుపదులు ముప్పై కావ్యాలు, వివేచన- 2 త్వరలో రానున్నాయి. ''మగ్గం బతుకు'' దీర్ఘ కావ్యం ఆంగ్ల, హిందీ భాషల్లో కి అనువాదమైంది.

 

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

జననం: రెడ్లవాడ గ్రామం, నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. రచయిత్రి, విమర్శకురాలు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. రచనలు: ఆర్య సమాజ సాహిత్యం మహిళాభ్యుదయం, 2. ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలానుశీలనం సమగ్ర పరిశీలన, 3. అఓర రసాలు, 4. వ్యాస తోరణం. సంపాదకత్వం: జిగర్(తెలంగాణ విశిష్ట కవిత్వ సంకలనం, 2. యువ సాహితి(మిత్రులతో కలసి).

రచయిత్రి. గాయని. భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవిత్వం, కథలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, వ్యాసాలు అనేకం ప్రచురింపబడ్డాయి. కవిత్వంలో అజంతా అవార్డు, దేవులపల్లి అవార్డు, కుందుర్తి అవార్డు మొ.న ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో పొందారు. వీరి రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

పుట్టింది చిన్న పెండ్యాల, వరంగల్. కవయిత్రి, రచయిత్రి, వ్యాఖ్యాత, ఉపన్యాసకురాలు. ఎం.ఏ. తెలుగు, టి.పి.టి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్.డీ (ఒద్దిరాజు సోదరులు, జీవితం, సాహిత్యం) పరిశోధన చేశారు. 20ఏళ్లు తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనలు: 1. అర్ర తలుపులు, 2. నిర్నిద్ర గానం, 3.ఎనిమిదో అడుగు(కవితా సంకలనాలు). జీవిత చరిత్రలు: (తెలుగు అకాడమీ)1. చిత్రకళాతపస్వి కొండపల్లి శేషగిరిరావు, 2. పెండ్యాల రాఘవరావు (నా ప్రజా జీవితం), 3. ఒద్దిరాజు సోదరులు, అమెరికాలో ఆరునెలలు(యాత్రా చరిత్ర). వ్యాసహారిక, సృజన రంజని(సాహిత్య విమర్శ), తెలంగాణ వేగుచుక్కలు- ఒద్దిరాజు సోదరులు (పరిశోధన గ్రంథం), ప్రస్తుతం 'తెలంగాణ సాహిత్యంలో స్త్రీల సాహిత్యం' పై పరిశోధనాత్మక రచన చేస్తున్నారు.

వరంగల్ ఏ.యస్.యం. మహిళా కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పదవీ విరమణ పొందారు. వివిధ సంకలనాలు, పత్రికలలో వీరి కవితలు, వ్యాసాలు, సమీక్షలు, కథలు, ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తెలంగాణ శాఖ సమన్వయ కర్తగా, రుద్రమ ప్రచురణలు, వరంగల్ వ్యవస్థాపక సభ్యురాలుగా కొనసాగుతున్నారు.

పుట్టింది మేడ్చెల్ జిల్లా హాజీపూర్‌. ''చిందు క‌ళాకారుల జీవ‌న చిత్రణ‌ - సాహిత్యానుశీల‌నం''పై ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ప‌రిశోధ‌న చేశారు. ర‌చ‌న‌లు: 'చిందు ఎల్ల‌మ్మ చిందుల హంస‌', 'నేను చిందేస్తే', 'కొంగ‌వాలు క‌త్తి'(తొలి తెలుగు చిందు న‌వ‌ల‌), 'అత‌డు అబ్ర‌హాం' లాంటి ర‌చ‌న‌లు చేశారు. ప్ర‌స్తుతం కోఠి మ‌హిళా క‌ళాశాల‌లో అధ్యాప‌కుడిగా ప‌నిచేస్తున్నారు.

ఒంగోలు, ప్రకాశం జిల్లా. కవయిత్రి, సోషలిస్ట్. వింగ్స్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్నారు.

పాలమూరు జిల్లా అంబట్ పల్లి. కవి, రచయిత, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు. విరసం సభ్యుడు. రచనలు: పొలమారిన పాలమూరు, గుత్తికొండ, మానాల(దీర్ఘ కవితలు), నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న, తెలంగాణ ఉద్యమాలు-పాట, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ-సామాజిక న్యాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు-విద్రోహ రాజకీయాలు, తెలంగాణ సాహిత్యం, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు; అగ్రకులత్వం, టీఎస్ఎఫ్ చరిత్ర, కాగితం మీద అక్షరానికి కమిటైన కవి, అకడమిక్ అన్ టచ్ బులిటీ. ఇరవయేళ్ల కవిత్వమంతా ''కాశీం కవిత్వం (1994 -2014)'' పేరుతో సమగ్ర సంకలనం ప్రచురించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

 

 

అనంత ప‌ద్మ‌నాభ(డిగ్రీ) క‌ళాశాల‌లో తెలుగు అధ్యాప‌కురాలిగా 34ఏళ్ల అనుభ‌వం. ప్రిన్సిప‌ల్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. 'తెలంగాణ విమోచ‌నోద్య‌మ న‌వ‌ల‌ల్లో స్త్రీచైత‌న్యం'పై ప‌రిశోధ‌న‌. ఇటీవ‌ల 'బ‌తుక‌మ్మ పాట‌ల్లో స్త్రీల మ‌నోభావాలు - పాట‌ల ప‌రిణామ క్ర‌మం' పుస్త‌కం ప్ర‌చురించారు. ప‌లు సంక‌ల‌నాల్లో వ్యాసాలు, క‌విత‌లు, క‌థ‌లు ప్ర‌చురిత‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' తెలంగాణ శాఖ అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు.

జననం: పేర్ణమిట్ట, ప్రకాశం జిల్లా. అధ్యాపకుడు, పాత్రికేయుడు. MA, M.Phil, PhD, (LLB) చదివారు. చలం, కొకు పై , బహుజన తాత్వికత పై పరిశోధన చేశారు. సంపాదకత్వం: నువ్వే లేకపోతే( అంబేద్కర్ విగ్రహ విధ్వంస నిరసన కవిత్వం), పరివర్తన నిజం-మత మార్పిడి అబద్ధం( కంధమాల్ దళిత క్రైస్తవుల హత్యల నిరసన కవిత్వం), తెగిపడిన చోట తెగబడటమే( లక్ష్మీపేట దళిత నరమేధం నిరసన కవిత్వం) సంకలనాలకు సంపాకత్వం వహించారు.

జననం: నల్లగొండ. కవి, కథకుడు, విమర్శకుడు. రెండు దశాబ్దాలుగా ఆధునిక సాహిత్యంలోని అనేకానేక అంశాలపై రచనలు చేస్తున్నారు. 'జంగం కథ - ఒక పరిశీలన' అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్,  'సమకాలీన తెలుగు వచన కవిత్వం-ప్రాంతీయతా ద్రుక్పథాలు' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేశారు. రచనలు: మొగురం(సాహిత్య వ్యాసాలు). ప్రస్తుతం హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

ఊరు హన్మకొండ. రచయిత్రి, కవయిత్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్.  ఎకనమిక్స్ లో డాక్టరేట్. కలంపేరు శ్రావణసంధ్య. దాదాపు 1500 కవితలు,  యాభై కథలు, ఇరవై వ్యాసాలు, వంద పాటలు,  రెండు వందల మినీ కవితలు రాశారు. కొద్దిరోజుల్లో రెండు పుస్తకాలు రానున్నాయి.

 

 

ఆధునిక దళిత జీవితాన్ని అక్షరీకరిస్తున్న పదునైన కలం డా.పసునూరి రవీందర్. కవిత్వం, కథ, విమర్శ, పరిశోధన ప్రక్రియల్లో బహుజన దృక్పథంతో రాణిస్తున్నారు. తన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథా సంపుటితో తెలంగాణ నుండి కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం అందుకున్న తొలి రచయిత. 'లడాయి', 'ఒంటరి యుద్ధభూమి', 'తెలంగాణ ఉద్యమపాట', 'గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ', 'ఇమ్మతి', 'పోటెత్తిన పాట' వంటి పలు పుస్తకాలు వెలువరించారు.

హైద‌రాబాద్‌లోని వివేక‌వ‌ర్ధ‌ని క‌ళాశాల ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 'ఆచూకీ'(మ‌రో ఇద్ద‌రు క‌వుల‌తో క‌లిసి), 'ప‌ర్యాయ‌ప‌దం' (క‌వితా సంక‌ల‌నం), ఒక క‌విత ఇర‌వై కోణాలు('కుంప‌టి' క‌విత‌పై ప్ర‌యోగం) వెలువ‌రించారు. త్వ‌ర‌లో మ‌రో క‌వితా సంక‌ల‌నం రాబోతోంది. క‌విత్వంతో పాటు ఇత‌ర క‌వుల క‌విత్వంపై విమ‌ర్శ వ్యాసాలు, బీసీ క‌వుల అస్తిత్వ సంచ‌ల‌న క‌విత్వ సంక‌ల‌నం 'స‌మూహం'కి ముందు మాట రాశారు.

సొంతూరు శాఖపట్నం దగ్గర లోని గనివాడ గ్రామం. ఎంబీఏ, పీఎచ్ డీ చేశారు. బిజినెస్ మేనేజ్మెంట్ లో రిటైర్డ్ ప్రొఫెసర్. హైదరాబాద్ నివాసం. ప్రస్తుతం USA లోని క్లీవ్లాండ్ లో ఉంటున్నారు.

జ‌న‌నం: తూర్పుగోదావరి జిల్లా- మన్యప్రాంతం రాజవొమ్మంగి మండలం గదవరం గ్రామం. కథకురాలు, సత్యాన్వేషి. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. కాకినాడలో పెండా సత్యనారాయణ మూర్తి సంస్కృత కళాశాలలో, పి.వి.ఆర్. ట్రస్ట్ డిగ్రీ కళాశాలలో తెలుగు రీడ‌ర్‌గా పనిచేసి రిటైర‌య్యారు. కథా సంకలనాలు : 'వెన్నెల ముగ్గు' (1980) కథతో కథారచయిత్రిగా సాహిత్య జీవితం ప్రారంభించి 'ఉత్సవ సౌరభం' (1996), 'కొండఫలం' (2009), 'కిటికీ బయటి వెన్నెల' (2014). సాహిత్యవ్యాసాలు: ‘సాహిత్యానుభవం' (2005), ‘ఆకులో ఆకునై' (2003). చలం సాహిత్యంపై చేసిన డాక్టరల్ పరిశోధన 'సత్యాన్వేషి చలం' (2007) పేరిట వెలువరించారు.

పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

పుట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల. మెడికల్ కాలేజీ జీవితం నుంచి సీరియస్‌గా కవిత్వం రాస్తున్నారు. రచనలు: 'జలపాత శబ్దంలోకి' (1997), 'ఎన్నాద్రి' (2008), 'ఇడుపు కాయితం' (2015), వైద్య వృత్తి మీద రాసిన 'అందని చందమామ' (దీర్ఘ కవిత 2008), 'ఇరువాలు' (తెలంగాణ సాహిత్య వ్యాసాలు (2013) ప్రచురించారు. ప్రస్తుతం హైదరాబాదులో పిల్లల వైద్యుడిగా పని చేస్తున్నారు.

కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు: లంబా హై సఫర్( సమగ్ర కవిత్వం),  కొండా... కోనల్లో...(కథలు), దూరాల చేరువలో.

పుట్టింది నార్సింగి, చేగుంట మండలం మెదక్ జిల్లా. హైదరాబాద్ అల్వాల్ లో ఉంటున్నారు. "మెదక్ జిల్లా రచయితల సాహిత్య కృషి - వివిధ ధోరణులు" అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశారు. రచనలు 1) ఒక వేకువ కోసం (కవిత్వం ) 2) తెలంగాణ విస్మృత వీరుడు కేవల్ కిషన్ 3) పల్లె పూలవాన బాల్యం బతుకు కథలు 4) అక్షర శిల్పి వేముగంటి 5) గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ మోనోగ్రాఫ్ 6) మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర 7) మెతుకు కథలు (సంపాదకీయం) 8) తొలినాళ్ళ సోయి (సంపాదకీయం) 9) నూరు పూలు నందిని సిధారెడ్డి పీఠికలు (సంపాదకీయం) ముద్రించారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.

జననం: పాలమూరు జిల్లా. కవి, రచయిత, పరిశోధకుడు. "మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం" అనే అంశంపై పరిశోధన చేశారు. రచనలు: పాలమూరు కవిత, సోది (తెలంగాణ హైకూలు), బతుకమ్మ నానీలు, మొగ్గలు, పసిడి నానీలు వంటి పుస్తకాలను వెలువరించారు. తెలుగు సాహిత్యంలో "మొగ్గలు" అనే నూతన కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

అనంతపురం. రచయిత్రి, అధ్యాపకురాలు.  ఎం.ఎస్సి., పిహెచ్.డి. చదివారు.  వృత్తి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర బోధన. సాహిత్య కృషి: విజ్ఞాన శాస్త్ర బోధన, పరిశోధన నాకు వృత్తిగతమైతే, సాహిత్యం అత్యంత ప్రియమైన ప్రవృత్తి. హైస్కూల్లో చదువు తున్నప్పుడు చిన్నగా కవిత్వం మొదలైంది. కాలేజీ రోజుల నుంచి ఈనాటి వరకూ విజ్ఞాన దాయకమైన, సామాజిక, సాహితీ అంశాల గురించి వివిధ పత్రికలలో వ్యాసాలు రాశారు. ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు చేశారు. 2013 నుంచి కథా రచన మొదలయింది. మొదటి కథ సాహిత్య ప్రస్థానం పత్రికలో ప్రచురించిన మరణ వాంగ్మూలం. ఇంతవరకూ దాదాపు 35 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. 18 కథలతో ‘కోయిల చెట్టు’ పేరుతో కథాసంకలనం ప్రచురితమైంది.

పుట్టింది,పెరిగింది కొత్తగూడెం టౌన్. వైద్య విద్య చదివింది,వృత్తి సాగిస్తున్నది హైదరాబాదు నగరం లో. విద్యార్ధి దశ నుండి ప్రజాసాంస్కృతిక ఉద్యమ గమనంలో పాలు పంచుకుంటున్న వేకువ పూలు నవల, ఖలీల్ గిబ్రాన్ రచనల అనువాదాలు- ప్రవక్త, తిరుగు బాటు స్వరాలు కథలు, సోవియట్ సాహిత్య భాస్కరులు పుస్తక రూపం లో వెలువడ్డాయి. సామాజిక సాంస్కృతిక అంశాల పై అనేక వ్యాసాలు. మన తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి తదితర దిన పత్రికలలోనూ, ఉపాధ్యాయ ప్రగతి, ట్రెండింగ్ తెలుగు న్యూస్, కౌంటర్ కరెంట్ వంటి వెబ్ పత్రికలలోనూ తరచుగా కనిపిస్తాయి. సాహిత్య విశ్లేషణ అభిమాన పాత్ర మైన అంశం;. జ్వాల ప్రచురణల సంపాదక సభ్యునిగా ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి రచనలను ఐదు సంపుటాలుగా వెలువరించటం సంతృప్తి కలిగించిన అంశం.

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

పుట్టింది పెద్ద గూడూరు; తల్లి తండ్రులు: శ్రీహరి, పుష్పలీల; చదువు: ఎం.ఎ, బిఎడ్, (పిహెచ్.డి); ఉద్యోగం : స్కూల్ అసిస్టెంట్, తెలుగు; పాఠశాల పేరు : జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల వి.ఎస్ లక్ష్మీపురం. ప్రస్తుత నివాసం: మహబూబాబాద్. సెల్: 8978439551. రచనలు : 1. నీటి దీపం (కవిత్వం) 2. ఇన్ బాక్స్ (కవిత్వం). ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, విమర్శ- పరిశీలన అనే అంశంపై డా.ఎస్.రఘు గారి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నాడు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు. గ్రామం - దాచారం, మం. బెజ్జంకి, జిల్లా - సిద్దిపేట( కొత్తది) కరీంనగర్ (పాతది)

మహబూబాబాద్ జిల్లాకు చెందిన తొర్రూరులో నివాసం. ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. 2007 నుండి కవితలూ, కథలూ రాస్తున్నారు. 2007లో 'మనో నేత్రం' కవితా సంపుటినీ, 2008లో మరో కవితా సంపుటి 'నేల కంటి రెప్పల కదలిక' ని ప్రచురించారు. వందకు పైగా కథలు వివిధ పత్రికలలో వచ్చాయి. 2010లో 'బతుకు గోస' కథా సంపుటినీ, 2019లో 'మాతృవందనం' కథా సంపుటిని ప్రచురించారు. పదిహేను కథలకు బహుమతులు పొందారు.

జ‌న‌నం: న‌ల్ల‌గొండ జిల్లా. అస‌లు పేరు ప‌ద్మ మిర్యాల‌. బీఎస్సీ(B.Z.C), PG Diploma in Journalism. వృత్తి: జ‌ర్న‌లిస్టు. మొద‌ట్లో 'క‌రుణ' పేరుతో క‌థ‌లు రాశారు. 23ఏండ్ల వ‌య‌సులో 'తాయ‌మ్మ' క‌థ రాశారు. ఇది క‌రుణ‌ మొట్ట‌మొద‌టి క‌థ . రాసిన మూడేండ్ల త‌ర్వాత 1996లో 'మ‌హిళా మార్గం'లో అచ్చ‌యింది. ఈ క‌థ పేరుతో 'కరుణ' '- 'తాయ‌మ్మ క‌రుణ‌'గా మారింది. ఆంధ్రప్రభ, సాక్షి, ప్రస్తుతం 'నవతెలంగాణ'లో.  మొదటి కథల సంపుటి 'తాయమ్మ మరికొన్ని కథలు' 2009లో, 2వ కథల సంపుటి 'జీవితం' 2018లో ప్రచురితమయ్యాయి. కవితలు, వ్యాసాలు అచ్చయ్యాయి. 13 ఏండ్లు విప్లవోద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు.

ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. కవి, సాహిత్య విశ్లేషకుడు, జర్నలిస్టు. ఉస్మానియా యూనివర్సిటీలో  ఎం.ఏ చదివారు.  రచనలు: వెలుతురు వాహకం (కవిత్వం), జానపదం (పరిశోధన వ్యాసాలు) రచించారు.

ఇండిపెండెంట్ జర్నలిస్ట్

జననం: కోవెలకుంట్ల, కర్నూల్ జిల్లా. ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి. రచనలు: శిథిల చిత్రాల జాతర (వచన కవితా సంపుటి : 2013). బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

పుట్టింది కరీంనగర్ జిల్లా కోహెడ మండలం, నాగసముద్రాల. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రచనలు: పునాస, ఎర్రమట్టి బండి(కవితా సంకలనాలు). చిక్కనవుతున్న పాట, పొక్కిలి, మత్తడి, మునుం, ఎడపాయలు, మొగులైంది, దూదిపూల దు:ఖం, నూరు అలల హోరు(ప్రజా సాహితి)లాంటి సంకలనాల్లో పలు కవితలు ప్రచురితమయ్యాయి.

జననం: సిద్ధిపేట. విశ్రాంత ఉపాధ్యాయుడు. రచనలు: 'గోరుకొయ్యలు', 'పట్టు కుచ్చుల పువ్వు', 'విరమించని వాక్యం' (కవితా సంపుటాలు). మంజీరా రచయితల సంఘం సభ్యుడు.

పుట్టింది అనంతారం(అనంతవరం), నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. కులవృత్తి చేస్తూ సామాజిక నేపథ్యంతో కవిత్వం రాస్తున్నారు. రచనలు: వన్నె(2007), డాకలి దీర్ఘకవిత (2014), పుటం(2018) కవితా సంకలనాలు ప్రచురించారు. డెబ్భై మంది విశ్వకర్మ కవులతో 'రుంజ', 'అంకిలి' కవిత్వ సంకలనాలకు సంపాదకుడిగా పని చేశారు. "ఎరుక" సాహిత్య సాంస్కృతిక వేదికలో పని చేస్తున్నారు.

పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం. కవి, జర్నలిస్టు. గీతా విద్యాలయం(శ్రీకాకుళం)లో మొదలు పెట్టి ఎస్ఎమ్‌యుపి స్కూల్లో ప్రాథమిక విద్య. ఏడు రోడ్ల జంక్షన్‌లోని ఎం.హెచ్.స్కూల్లో ఉన్నత విద్య. ఆముదాల వలస, మందసల్లో ఇంటర్ తొలి, మలి సంవత్సరాలు. బారువాలో బి.కాం. డిగ్రీ చదివారు. ఉద్యోగ విరమణ అనంతరం తల్లిదండ్రులు స్థిరపడిన విశాఖలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, పొట్ట చేతబట్టుకుని 1995లో హైదరాబాద్ చేరిక. జర్నలిస్ట్‌ గా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియాల్లో పని. రచనలు: ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’(2000), ‘దుర్గా పురం రోడ్’(2019) కవితా సంకలనాలు వెలువడ్డాయి. ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటికి ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు, పాతూరి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య స్ఫూర్తి పురస్కారం ప్రకటించారు. తరచుగా కవిత్వం, అరుదుగా కథలు, అలవోకగా పుస్తక పరిచయాలు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, అనువాదాలు, వ్యాసాలు రాస్తుంటారు.

పుట్టిన ఊరు వింజమూరు, నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. ఎనిమిదో తరగతి నుంచే కవిత్వం రాస్తున్నాడు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం  ప్రాచ్య కళాశాల(నల్లకుంట, హైదరాబాద్)లో డిగ్రీ చదువుతున్నాడు.

పుట్టిన ఊరు ఒంగోలు.  అసలు పేరు కరిముల్లా ఖాన్.  కలం పేరు నబి కరీంఖాన్. కార్మికుడు, సామాజిక కార్యకర్త, కవి. పదో తరగతి వరకు చదువుకున్నారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టారు. CPMలో కొంత కాలం క్రితం వరకు సభ్యునిగా ఉండి పార్టీ ప్రజా సంఘాలైన యువజన, మైనారిటీ ప్రజా సంఘాలలో పనిచేశారు. అనారోగ్యంతో మరణించిన తన పెద్దన్నయ్య నబిఖాన్  ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకు, తన క్షరాలలొ అన్న బతికే వుండాలని ఆకాంక్షతో వారి పేరును కలం పేరుగా పెట్టుకున్నారు. రచనలు: నిషిద్దాక్షరాలు(కవితా సంకలనం. రఫీ అనే మిత్రుడితో కలిసి 2003లో), వేకువకోసం (దీర్ఘ కవిత. 2007లో), ధోకా (దీర్ఘ కవిత. అముద్రితం). ఐదు కథలు రాశారు. అవి కథామినార్, మాతృక, ప్రియదత్త, ఆకాశవాణిలో ప్రసారం, ప్రచురితమయ్యాయి. 'గుజరాత్ గాయం' సంకలనం(2002) నుండి 'ముఖామి'(2017) వరకు అనేక ముస్లింవాద కవితా సంకలనాలలో నబి కరీంఖాన్ కవిత్వం ప్రచురితమైంది.

పుట్టింది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీ పాలెం. కథా రచయిత, విరసం సభ్యురాలు. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదివారు. అక్కడే విద్యార్థి సంఘాలతో పరిచయం. రచనలు: జీవన స్పర్శ, గీతలకావల, నెగడు (కథా సంపుటాలు), పరామర్శ, జ్ఞానం అందరిదీ (వ్యాస సంకలనాలు), నర్రెంక సెట్టు కింద, ఒండ్రు మట్టి, నిషిధ, మేరువు (నవలలు) రాశారు.

పుట్టింది ములుగు జిల్లా అబ్బాపూర్. కవి, రచయిత, సామాజిక కార్యకర్త. అధ్యాపకుడు.  ప్రస్తుతం హన్మకొండ లో నివాసం ఉంటున్నారు. కవిత్వం, పాటలు, కథలు రాస్తారు. యువకవులు, రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో 2007లో వరంగల్ రచయితల సంఘం స్థాపించారు. వివిధ సామాజిక అంశాలపై ప్రచురించిన పదిహేడు పుస్తకాలకు సంపాదకుడిగా ఉన్నారు. "ఆశయాల పందిరి" (కవిత్వం), "చావైనా రేవైనా"(వీధి నాటిక) స్వీయ సృజన రచనలు ముద్రించారు.

మహబూబ్ నగర్ జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు : పక్షులు (దీర్ఘ కవిత), అతను వ్యాపిస్తాడు
(కవితాసంకలనం). జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇప్పటూర్(మహబూబ్ నగర్ జిల్లా)లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందినవారు. నివాసం హైదరాబాద్. జర్నలిజంలో పి.జి. చేశారు. వివిధ ప్రముఖ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం 'తెలంగాణ పవర్' అనే దినపత్రికకు, 'సమీక్ష' అనే మాసపత్రికకు ఎడిటర్ గా పని చేస్తున్నారు. 'ౙఖ్మీ' కవితా సంపుటి ప్రచురించారు. ముస్లిం జీవితాల్లోని ‌సంఘర్షణలను ఆవిష్కరించేలా కథలు రాస్తున్నారు.

కవయిత్రి, కథా రచయిత. అధ్యాపకురాలు. పుట్టింది పూర్వ కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ మండలం పోతారం గ్రామం. ఎంఏ, బీఈడీ చదివారు. రచనలు: నెమలీకలు (నానీల సంపుటి) 2006, 'మట్టి నా ఆలంభన'(కవితా సంపుటి) 2009, 'మట్టి నానీలు'(నానీలు) 2015 ప్రచురించారు. వివిధ పత్రికల్లో కవిత్వం, కథలు అచ్చయ్యాయి.

లక్ష్మీపురం, పరకాల మండలం, వరంగల్ రూరల్ జిల్లా. జర్నలిస్టు. ఎంఏ(జర్నలిజం), ఎల్ ఎల్ బీ చదివాడు. ఓ దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు.

వరంగల్ జిల్లా నెల్లికుదురు నివాసం. కవి, గాయకుడు. ఎం. కామ్, బీఎడ్ చదివారు. రచనలు:  'అలలు', 'పూలు రాలిన చోట', 'గెద్దొచ్చే కోడిపిల్ల' అనే పేర్లతో మూడు కవితా సంకలనాలు ప్రచురించారు. 1996 నుండి విరసం సభ్యుడిగా ఉన్నారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడూ సమీక్షలూ, పాటలు రాస్తున్నప్పటికీ ప్రధానంగా కవిత్వమే ప్రధాన వ్యాపకం.

పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

పుట్టింది మంగ‌లి ప‌ల్లె, గోదావ‌రి ఖ‌ని. ఫ్రీలాన్స్ రైట‌ర్‌. 2012నుంచి క‌విత్వం, కథ‌, విమ‌ర్శ రాస్తున్నారు.

సామాజిక కార్యకర్త. గాయని. బుర్రకథ కళాకారిణి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఎం.ఏ (ఆర్థిక శాస్త్రం), ఎల్.ఎల్. బీ. చదివారు. ఆకాశవాణిలో పదేళ్ల పాటు casual announcer గా పని చేశారు. TV 9, Vanitha TV, 10TV ల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. యూనిసెఫ్, లాడ్లీ మీడియా అవార్డులతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఉత్తమ జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ అవార్డు అందుకున్నారు. Center for Sustainable Agriculture లో Krishi TV (వ్యవసాయ) యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ప్రసుతం Voice of the People పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆరేళ్లుగా పిల్లల కోసం ' కథల ప్రపంచం ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.

రిటైర్డ్ జర్నలిజం ప్రొఫెసర్, ఉస్మానియా యునివర్సిటీ

పుట్టిన ఊరినే ఇంటి పేరుగా మార్చుకుని 1991 నుంచి కథ‌, కవిత్వం, నవల, విమర్శ రంగాల్లో రచనలు చేస్తున్నారు. మూడు కథా సంపుటాలు- 'గది లోపలి గోడ', 'చిగురించే మనుషులు', 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు', రెండు కవితా సంపుటాలు- 'మాటల్లేని వేళ', 'ఇద్దరి మధ్య', ఒక నవల- 'నేల నవ్వింది' వెలువరించారు. ఆంగ్ల భాషలోనూ కవిత్వం అచ్చయ్యింది. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య వ్యవస్థాపక కన్వీనర్.

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

కవి, రచయిత, విమర్శకుడు, వక్త. విరసం కార్యవర్గ సభ్యుడు. గతంలో విరసం కార్యదర్శిగా పని చేశారు. రచనలు: 'కలిసి పాడాల్సిన గీతమొక్కటే' (కవిత్వం), 'అబుజ్మాడ్' (కవిత్వం), 'నేరేడు రంగు పిల్లవాడు' (కథలు), 'జనతన రాజ్యం', 'సృజనాత్మక ధిక్కారం'. రెండు దశాబ్దాలుగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలో కృషి చేస్తున్నారు.

ఇంజినీరింగ్ చదువుకున్నారు. సాహిత్యం, రాజ‌కీయార్థిక శాస్త్రాల అధ్యయ‌నంలో అభిరుచి. మూడు ద‌శాబ్దాల‌పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో ప‌నిచేశారు. సీడీఆర్‌సీ, వీక్ష‌ణం మాస‌ప‌త్రిక‌తో ఎనిమిదేళ్లు ప‌నిచేశారు. భార‌త‌దేశంలో కుల‌, వ‌ర్గ సంబంధాల‌పై అధ్య‌యనం చేస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉంటున్నారు.

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ సాహిత్యాన్ని, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో విరసంతో పరిచయం ఏర్పడింది. 2005 నుండి విరసం సభ్యురాలిని. ప్రస్తుతం అరుణతార వర్కింగ్ ఎడిటర్ గా ఉన్నాను. నా రచనల్లో సామాజిక రాజకీయ పర్యావరణ సంబంధమైన వ్యాసాలే ఎక్కువ. సాహిత్య వ్యాసాలు, కొన్ని కథలు, చాలా తక్కువగా కవిత్వం రాశాను. కూడంకుళం అణువిద్యుత్ కు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం జరిగుతున్నప్పుడు అక్కడి ప్రజలను జైల్లో కలిశాక రాసిన 'సముద్రంతో సంభాషణ' నా మొదటి పుస్తకం.

పుట్టింది మహబూబ్‌నగర్ నగర్ జిల్లా షాద్‌నగర్. కవి, రచయిత, విరసం సభ్యుడు. పూర్వపు వరంగల్ జిల్లాలో  ముప్ఫై ఏళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పదవీ వీరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు.  "అసలుదారి" కథా సంపుటి ప్రచురించారు. మాజీ ఐపీఎస్ అధికారి విభూతి నారాయణ్ ఆంగ్లంలో రాసిన "నగరంలో కర్ఫ్యూ" అనే నవలికను తెలుగులో అనువాదం చేశారు. 'న్యాయ విచారణ', 'వందే మాతరం' అనే మరో రెండు కథల్ని తెలుగు చేశారు. వివిధ పత్రికల్లో నవలలు, కవితా సంకలనాల సమీక్షలు, సామాజిక రాజకీయ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

తెనాలి పక్క వుండే కొలకలూరు లో పుట్టి పెరిగి అక్కడ  హైస్కూల్  లో చదివి ఆపైన  ఎం.ఎ ఇంగ్లీష్ చేశారు. విజయవాడ లో అధ్యాపకురాలిగా పనిచేశారు. నాలుగు కథా సంకలనాలు వెలువడ్డాయి. వాటిలోని 40 కథలు ఎంపిక చేసి "సత్యవతి కథలు" గా ఇటీవల విశాలాంధ్ర ప్రచురించింది. హైదరాబాదు బుక్ ట్రస్టు కు 'ముహమ్మద్ ప్రవక్త జీవితం',  'మానాయనబాలయ్య',  'ఒక హిజ్రా ఆత్మ కథ' ( రేవతి జీవితం), అనేక రామాయణాలు అనువాదం చేశారు. రేవతి ఆత్మకథకు ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది. ప్రపంచంలోని ఏడు అత్యున్నత శిఖరాలలో ఆరింటిని అధిరోహించిన చిన్నారి పూర్ణ కథను ఇంగ్లీష్ లో అపర్ణ తోట రాస్తే తెలుగు చేశారు. రెంటినీ ప్రిజం ప్రచురించింది. విజయవాడ లో వుంటారు.

సూర్యాపేట జిల్లా తుమ్మల పెన్ పహాడ్ గ్రామం. బీటెక్ చదివారు. కవి, విద్యార్థి ఉద్యమ నాయకుడు. తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేస్తున్నారు.

 

 

పుట్టింది ఏలూరు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్, డీ.కే.డబ్ల్యు కళాశాలలో విద్యాభ్యాసం. ఆంధ్ర విశ్వ విద్యాలయం/ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయాల్లో M.A, Ph.D, TCH (Teacher's Training), Diploma in Computer Application. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో అధ్యాపకురాలు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ గా పని చేశారు. 'అంతర్జాలంలో ని తెలుగు సాహిత్యం' అనే అంశం పై ప‌రిశోధ‌న చేశారు. వివిధ సాహిత్య అంశాలపై జాతీయ సెమినార్లలో 30 కి పైగా పత్ర సమర్పణలు చేశారు. తెలుగు మహిళా వెబ్ మాస పత్రిక 'విహంగ' 2011 జనవరిలో ప్రారంభించారు. 9 ఫిబ్ర‌వ‌రి, 2019న తుదిశ్వాస విడిచారు. ఆమె తేవాలనుకున్న ' వేకువ రాగంస‌( కవితా సంపుటి) , 'నీలికస‌ ( వ్యాస సంపుటి)ఆమె తదనంతరం ఆమె భర్త ఎండ్లూరి సుధాకర్, కూతురు మానస ఎండ్లూరి ప్రచురించారు.

వృత్తి : medical transcription. ప్రవృత్తి: కవిత్వం, కథ, సమీక్షలు, విమర్శ.
రెండు కవిత్వపు పుస్తకాలు ప్రచురించారు. ఇంకా కొన్ని సాహిత్య వ్యాసాలు రాశారు. నటన అంటే చాలా ఇష్టం. నాటక సమాజంలో పలు నాటకాలు వేసిన నేపథ్యం. ప్రస్తుతం ఉండేది హైదరాబాద్ లో.

జ‌న‌నం: కరీంనగర్ జిల్లా, గంభీరావుపేట మండలం, భీముని మల్లారెడ్డిపేట. ఇంటర్మీడియట్ గంభీరావుపేట, బీఎస్సీ సిద్ధిపేట‌, ఎంఎస్సీ కాకతీయ విశ్వవిద్యాలయంలో చ‌దివారు. ఇల్లంతకుంట మండలం, రామాజీపేటలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేపనిచేస్తున్నారు. నవలలు: జిగిరి, ఎడారి మంటలు, దాడి, ఊరికి ఉప్పులం, సంచారి, లాంగ్ మార్చ్. కథాసంపుటాలు: ఊటబాయి, భూమడు, మాఊరి బాగోతం, మాయి ముంత, వలస బతుకులు, పోరుగడ్డ (కథలు, వ్యాసాలు), జుమ్మేకి రాత్ మే(క‌థ‌ల సంపుటి) ప్ర‌చురించారు.

జననం: ఆరెపల్లి, కోహెడ మండలం, సిద్ధిపేట జిల్లా. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు(హిందీ పండిట్ గ్రేడ్- 2). కవితా సంపుటాలు: ఎగిలివారంగ(2008), పో ఇగ పొత్తు కల్వదు(2010), దండెడ(2011), మిగ్గు(2016). నవల: లంద(2019). 'ఎగిలివారంగ' కవిత్వం తెలంగాణ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. 'తెలుగు, హిందీ దళిత కవిత్వంలో వ్యక్తీకరణ-శిల్పం' అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు.

స్వస్థలం వెలిదండ, నేరేడుచర్ల మండలం సూర్యాపేట జిల్లా. కవి, రచయిత, పరిశోధకుడు. B.Tech, M.Tech, MIAENG, M.A, PGDHR చదివారు.  ఉస్మానియా యూనివర్శిటీలో పరిశోధన(Ph.D) చేస్తున్నారు.  అనేక సామాజిక సమస్యలు, పరిష్కారాలపై రాసిన కవిత్వం, వ్యాసాలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

పుట్టిన ఊరు నిడమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా. ఎంఏ(తెలుగు), ఎంఏ(ఇంగ్లిష్), శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ చేశారు. ఐదేళ్లు ప్రింట్, పదేళ్లు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశారు. రచనలు: 1. కలనేత(1999), 2. మాట్లాడుకోవాలి(2007), 3. నాన్న చెట్టు(2010), 4. పూలండోయ్ పూలు(2014), 5. చేనుగట్టు పియానో(2016), 6. దేశం లేని ప్రజలు(2018), 7. మిత్రుడొచ్చిన వేళ(2019), ప్రసాదమూర్తి కవిత్వం(2019) కవితా సంకలనాలు. సగం పిట్ట(2019) కథా సంపుటి ప్రచురించారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

పుట్టింది నెల్లూరు జిల్లా, అల్లూరు గ్రామం. చదవడం చాలా ఇష్టం. ఆపైన సినిమా. అప్పుడప్పుడు వ్రాయడం. అంతరంగాన్ని, ఆలోచనలని మార్చే రచనలన్నా, కళలన్నా, ఆ కళాకారులన్నా ప్రేమ.

జ‌న‌నం: గుంటూరు జిల్లా ప్యాప‌ర్రు. నాగార్జున విశ్వ‌విద్యాలయంలో బుద్ధిస్ట్ స్ట‌డీస్‌లో అసోసియేట్ ప్రొఫెస‌ర్ గా ప‌నిచేస్తున్నారు. ర‌చ‌న‌లు: అస్తిత్వ గానం, మంకెనపువ్వు(క‌వితా సంక‌ల‌నాలు), 'Caste, Religion and State in Medieval South India', 'Facets of Gender Discrimination and Violence, 'Tribe- Peasant- Elite Dynamics in Medieval Andhra'.

జ‌న‌నం: బంద‌రు. హైద‌రాబాద్‌లో పెరిగారు. విద్యాభ్యాసం: ఎంఏ., ఎల్ఎల్‌బీ. సుదీర్ఘ కాలం ప్ర‌జ‌ల కోసం విప్ల‌వోద్య‌మంలో ప‌నిచేశారు. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో అడ్వ‌కేట్‌గా, రాజ‌కీయ ఖైదీల విడుద‌ల క‌మిటీలో కార్య‌కర్త‌గా ప‌నిచేస్తున్నారు.

పుట్టిందీ, పెరిగిందీ బ‌రంపురంలో. క‌వి, ర‌చ‌యిత‌. చ‌దువుకున్న‌ది బీకాం (ఆన‌ర్స్‌), ఎం.కాం మ‌ధ్య‌లోనే మానేశారు. త‌ర్వాత ఎంఏ తెలుగు. తెలుగులో విరివిగా క‌విత్వం రాస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే బ‌రంపురం సాహితీ సంస్థ‌లు ఆంధ్ర భాషాభివ‌ర్ధ‌నీ స‌మాజం, ఆంధ్ర సంస్కృతీ స‌మితి, వికాసం, ఆంధ్ర విజ్ఞాన మిత్ర‌మండ‌లి వంటి వాటితో అనుబంధం. ఆంధ్ర సంస్కృతీ స‌మితి, వికాసం సంస్థ‌ల‌కు స‌హ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. బ‌రంపురం వార్త పీసీ సెంట‌ర్‌లో ప‌నిచేసే రోజుల్లో `విర‌సం` స్ఫూర్తితో ప్రారంభించిన `ఒడిశా గొణొముక్తి లేఖొకొ సొమాఖ్యొ`కు, ఏపీసీఎల్‌సీ త‌ర‌హాలో ప్రారంభించిన `ఒరిస్సా సివిల్ లిబ‌ర్టీస్ క‌మిటీ`కి వ్య‌వ‌స్థాప‌క కోశాధికారిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం `సాక్షి`లో ఆదివారం అనుబంధం `ఫ‌న్‌డే` ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్నారు.

ఖమ్మం వాసి. చదవడం ఇష్టం. కవిత్వం, కథలు, విశ్లేషణ వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో 'కవితాంశ' కాలమ్ నిర్వహిస్తున్నారు. తెలుగు తో పాటు వివిధ భాషల కవిత్వం పరిచయం చేస్తున్నారు.

వరంగల్ గ్రామీణ జిల్లాలోని పాత మగ్ధుంపురం. కవి. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. రచనలు:  గరికపోస(2010) ,
నిప్పుమెరికెలు(2013), గోస(2016), వెలుతురు గబ్బిలం(2018) అనే వచన కవితా సంపుటాలు వెలువరించారు.

పోరాం, విజయనగరం జిల్లా. ఉపాధ్యాయుడు. బడన్నా పిల్లలన్నా కవిత్వమన్నా ఇష్టం. బతుకును బతుకులా ప్రేమించటమంటే ఇంకా ఇష్టం. 'ఎగ‌రాల్సిన స‌మ‌యం'(2014), 'ఆకు క‌ద‌ల‌ని చోట'(2016) క‌వితా సంక‌ల‌నాలు ప్ర‌చురించారు.

పూర్తి పేరు అయిక బాలాజీ. 1990లో చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపకుల్లో ఒకరు. ప్రస్తుత సంపాదకులు. ‘జన విజ్ఞాన వేదిక’ పశ్చిమ బెంగాలు శాఖ అధ్యక్షులు . ‘బాలాజీ’ (కోల్‌కతా) పేర సాహిత్యం, సైన్సు వ్యాసాలు , సినిమా సమీక్షలు , అనువాదాలు రాస్తుంటారు. ‘ముందడుగు’, ‘ప్రజాసాహితి’, ‘రస్తా’ (వెబ్‌ మ్యాగజైన్‌), ‘సైన్స్‌ - హేతువాదం’, ‘ప్రజాశక్తి’, ‘మాతృక’ తదితర పత్రికల్లో ఇతని రచనలు వస్తుంటాయి. గతంలో ‘మందుల మాయాబజార్‌’ అనువాద రచన, ఇటీవల ‘అసత్య ప్రేలాపనలు – సైన్సు సమాధానాలు’ పుస్తకం వెలువడింది. ‘ముందడుగు’ తరుపున స్లయిడ్‌ షోలు, టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతిశీల విమర్శకులు. కోల్‌కతాలో నివసించే సామాజిక కార్యకర్త. వృత్తిరీత్యా బ్యాంక్‌ ఉద్యోగి.

Pradeep is the national Vice-President of IFTU (Indian Federation of Trade Unions).

జననం: వరంగల్ జిల్లా వేలేరు. కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రచనలు: పోరుగానం (తెలంగాణ ఉద్యమ గేయ సంపుటి), బలిదానాలు మరుద్దాం (బుక్లెట్), పిడికిలి (తెలంగాణ ఉద్యమ కవితా సంపుటి), కాలాన్ని గెలుస్తూ.. (ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం) – సంపాదకత్వం, గెలుపు చిరునామా (ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితా సంపుటి), కొన్ని ప్రశ్నలు - కొన్ని జ్ఞాపకాలు(కవితా సంపుటి).

బెజ్జారపు రవీందర్. కథారచయిత. తెలంగాణలోని ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామం. ఎం.ఏ, బి.ఈడీ. చదివారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగం, నివాసం. రచనలు : నిత్యగాయాల నది(కథా సంకలనం), తాటక (నవల).

పరిశోధక విద్యార్థి,
హైదరాబాద్ విశ్వవిద్యాలయం.

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

వృత్తి - వైద్యం. ప్రవృత్తి - సంగీత సాహిత్యాల లోతులు తరచే ప్రయత్నం. పబ్లిషర్ గా 1. "ఆలాపన" మొదటి భాగం (రచయిత ప్రముఖ మ్యూజికాలజిస్ట్ వి.ఎ.కె .రంగారావు) 2. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలు (తెలుగు సేత కస్తూరి నరసింహ మూర్తి) ప్రచురించారు. రచయిత్రిగా 1. "ఒక భార్గవి" వ్యాస సంకలనం 2. "రెండు ప్రయాణాలు" (అమెరికా గుజరాత్ ట్రావలాగ్) 3. "గీతాంజలి" (రవీంద్రుని గీతాంజలి కి తెలుగు అనువాదం) ప్రచురించారు.

జ‌ననం: హైద‌రాబాద్‌. 'జ‌న‌నాట్య మండ‌లి' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు. 'విర‌సం' స‌భ్యుడు. నాలుగు క‌థా సంపుటాలు, మూడు న‌వ‌ల‌లు, బాల‌సాహిత్యంలో 12 పుస్త‌కాలు, కొన్ని పాట‌ల పుస్త‌కాలు, ఆరు బ్యాలేలు రాశారు. 'మా భూమి', 'దాసి', 'కొమురం భీం' తదితర చిత్రాల్లో న‌టించారు. 'పొట్ల‌ప‌ల్లి రామారావు సాహిత్యం' పై పీహెచ్‌డీ చేశారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం, రచనావ్యాసంగం, అడపా దడపా సినిమాల్లో పని చేస్తున్నారు.

విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు. రచనలు : సూర్యుడు తప్పిపోయాడు, నిషిద్ధాక్షరి, నీలి గోరింట(కవితా సంపుటాలు), వాన చినుకులు (వ్యాస సంపుటి), అవార్డులు:  కృష్ణశాస్త్రి అవార్డు, సి.నారాయణరెడ్డి అవార్డు, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్, ఉమ్మడిశెట్టి రాధేయ అవార్డ్, ఎక్స్ రే అవార్డ్, శ్రీశ్రీ పురస్కారం, సహృదయ అవార్డ్, నాగభైరవ పురస్కారం పొందారు. వీరి కవిత్వం వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైంది.

కథా రచయిత్రి. 2010లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చదవడమంటే ఇష్టం. కథలు రాయాలనే అభిలాషతో రాసిన తొలి కథ “కృష్ణం వందే జగద్గురుం” కౌముదిలో ప్రచురిచతమైంది. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా డెబ్బై ఐదు. తొలి కథ కౌముది అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైంది. నవ్య, ఆంధ్రభూమి, స్వాతి, తెలుగు వెలుగు, విపుల, రచన, జాగృతి వంటి వార, మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, ప్రజాశక్తి, వెలుగు వంటి దినపత్రికల్లోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ కథలు ప్రచురితమయ్యాయి. చతుర మాస పత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురణ అయింది. రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో సీరియల్ గా వచ్చి , పుస్తకంగా వెలువడింది. మూడవ నవల ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురిచతమయింది.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

కవయిత్రి మహెజబీన్ మానవ హక్కుల న్యాయవాది. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో వామపక్ష విద్యార్ధి ఉద్యమాలలో పాల్గొన్నారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై కవిత్వం రాయడం మొదలుపెట్టారు. జబీన్ కవిత్వంలో ఉద్యమ ఛాయలు కనిపిస్తాయి. ఆమె తొలి కవితాసంపుటి "ఆకురాలు కాలం " 1997 లో ప్రచురించారు. ముఖ్యంగా ఆమె కవిత్వాన్ని రెండు కోణాల్లో చూడచ్చు. Feminist perspective and Revolutionary romanticism. పొలిటికల్ ఎన్కౌంటర్లకు సంబంధించిన ఆవేదన ఆమె కవిత్వం లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఒకప్పుడు విరసం సభ్యురాలు. నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ లో విరసం యూనిట్ లో పనిచేశారు. ఆమె మీద సివిల్ లిబర్టీస్ (civil liberties), మానవ హక్కుల (Human rights) ఉద్యమాలు ప్రభావం చూపాయి. ఇప్పటి వరకు సీరియస్ కవిత్వమే రాశారు. ప్రొఫెసర్ హరగోపాల్ కు స్టూడెంట్. MA(సోషల్ వర్క్ ), LLB, Human Rights (PDGHR) చదివారు. Formal fellow DAAD, Germany. కవిత్వంతో పాటు fiction, prose కూడా రాసారు. హైదరాబాద్ హై కోర్ట్ లో క్రిమినల్ లాయర్ గా ఉన్నారు.

పుట్టింది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డీ. కవి, సామాజిక కార్యకర్త. ఎంబీఏ చదివారు. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.

పుట్టింది కడప. గత పదిహేడేళ్ళుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. పుస్తక ప్రేమి. కవయిత్రి. కథా రచయిత్రి. మీర్కట్ ప్రెస్, పెంగ్విన్ రాండమ్ హౌస్ లాంటి అనేక పబ్లిషింగ్ సంస్థలకు www.theclippednightingale.com అనే బ్లాగ్ లో పుస్తక సమీక్షలు రాస్తారు. ఈ మధ్యే కవితలు, కథానికలు రాస్తున్నారు. వృత్తి రీత్యా ఒక IT కంపెనీకి రిక్రూటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.

తల్లి దండ్రులు : పుట్ల హేమలత, ఎండ్లూరి సుధాకర్; పుట్టి పెరిగిన ప్రాంతం : పుట్టిన ఊరు నెల్లూరు, పెరిగినది రాజమండ్రి; విద్యారహతలు : MA, Linguistics, HCU. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు 2016 లో త్రిపురలో, 2018లో అస్సాం లో నిర్వహించిన All India Young writers fests కి స్వీయ రచనా పఠణంకి తెలుగు నుండి ఏకైక రచయిత్రిగా ఆహ్వానం అందుకున్నారు. 2018 లో తన 22 కథలతో మిళింద అనే కథా సంపుటి తెచ్చారు. 2017 లో స్మైల్ స్మారక పురస్కారం, వెంకట సబ్బు స్మారక పురస్కారం. 2021 లో మాడభూషి పురస్కారం. పుట్ల హేమలత స్థాపించిన మొట్టమొదటి మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక ' విహంగ ' కు సంపాదకులు గా ఉన్నారు. 2015 లో వచ్చిన మరాఠీ నవల 'ఓ' ని, 2021 లో 'ఊరికి దక్షిణాన' గా ఇంగ్లీష్ లోంచి తెలుగు లోకి అనువదించారు. భారత దేశంలో వచ్చిన మొట్ట మొదటి దళిత ఆత్మకథ 'బలూత' ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి త్వరలో అనువదించనున్నారు.

పుట్టింది దేవరుప్పుల, వరంగల్ జిల్లా. చదివింది ఎం. ఏ, బి. ఎడ్. జననాట్య మండలిలో పని చేసింది. ప్రస్తుతం విరసం సభ్యురాలు. 'మాభూమి' సినిమాలో 'పల్లెటూరి పిల్లగాడా' పాటతో ఆమె పేరు 'మాభూమి సంధ్య'గా మారింది. నిజామాబాద్ జిల్లాలో హాస్టల్ సంక్షేమాధికారిగా పని చేసి రిటైర్ అయింది.

అమెరికాకి చెందిన ప్రగతిశీల హక్కుల కార్యకర్త, రచయిత్రి.   ఫెమినిస్ట్ రచనలు విస్తృతంగా చేశారు. 31మార్చ్ 1936 లో డెట్రాయిట్ లో జన్మించారు. నానమ్మ చెప్పే కథలూ.. అమ్మకున్న విస్తృతమైన సాహిత్య పఠనానుభవం..మార్జి పైర్సీ లో సాహిత్య సృజన పట్ల ఆసక్తిని కలిగించాయి. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్,నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీల్లో B.A., M.A. చదివారు.1976 లో స్త్రీవాద ఉద్యమాలు ఉధృతంగా మొదలైన రోజుల్లో స్త్రీల.. హక్కుల సంఘాలు నడిపించిన స్త్రీల పై హింసకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల కు సంఘీభావంగా రాసిన కవిత ఈ రేప్ పోయెమ్. రేప్ బాధితురాళ్ల అంతర బాహ్యఘర్షణలను అత్యంత ఆర్ద్రంగా.. వాస్తవిక మెటఫర్ లను ఉపయోగించి రాసారు. రచనలు: ఉమెన్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ టైం., హి, షి& ఇట్, గాన్ టు సొల్జేర్స్. తన సాహిత్య అభిరుచిని గౌరవించని మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది. తరువాత హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. ఆర్థర్ సి క్లార్క్ అవార్డ్, బ్రాడ్లీ అవార్డ్,బ్రిట్-హా-డోరోధ్ అవార్డ్,లాంటి చాలా అవార్డులు అందుకున్నారు.

పుట్టిన ప్రాంతం పుల్లిట మామిడిపల్లి, సంతకవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త. ఎం వీ స్వామిగా సుపరిచితం. కలం పేర్లు ఆజాద్, పృథ్వి. ముప్ఫయేళ్లుగా రాస్తున్నారు. సుమారు వెయ్యి కథలు, ఐదు వందల కవితలు, అధిక సంఖ్యలో పాటలు, గేయాలు, కథానికలు, వ్యాసాలు, హైకూలు, "నేటి బాలలకు నీతికథలు" పేరుతో బాలల కథల పుస్తకం ప్రచురించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కృష్ణదేవిపేట, గోలుగొండ మండలం, విశాఖ జిల్లాలో ఆంగ్లభాషా పాఠశాల సహాయకునిగా పని చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో నివాసముంటున్నారు.

పుట్టింది చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం. బతుకుదెరువు కోసం కార్వేటినగర్ మండలానికి వలసవెళ్లారు. పేదరికం వల్ల ఎక్కువగా చదువుకోలేదు. చిన్న చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. పదవ తరగతి పాసైన తరువాత యస్ వీ ఓరియంటల్ కాలేజీలో తెలుగు ప్రీ డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. తరువాత ఎస్వీ యూనివర్శిటీ(ఓపన్ యూనివర్సిటీ)లో చేరి మధ్యలోనే ఆపేశారు. ఇద్దరు పిల్లలు చదివి పెద్ద ఉద్యోగస్తులయ్యారు. ఇప్పుడు రచనలు చేయటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదవడం, నిమ్నకులాలతో కలసి తిరిగి వారి కష్ట సుఖాలను, వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకున్నారు. రచనలు : చాకిరేవు కతలు(2017), మావూరి మంగలి కతలు(2018), ప్రకృతి వికృతి(2019). మట్టి పూలు(కుమ్మరి కతలు), బాపూజీ ఓకల, వెలివాడ కతలు త్వరలో రానున్నాయి.

పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లో .  స్వస్థలం అప్పటి నల్లగొండ జిల్లా సూర్యాపేట దగ్గర వల్లభాపురం. కవయిత్రి, కథా రచయిత. సామాజిక కార్యకర్త. పన్నెండేళ్లుగా కవిత్వం రాస్తున్నారు. రచనలు: 'మాటల మడుగు', 'కాలం వాలిపోతున్న వైపు'  (కవిత్వ సంపుటాలు).  అప్పుడప్పుడు కథలు రాస్తుంటారు. 'మాటల మడుగు' పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. త్వరలో మరో కవిత్వ సంపుటి  రానుంది.

పుట్టిన ఊరు కప్పల దొడ్డి, కష్ణా జిల్లా. కవి, అధ్యాపకుడు. విరసం సభ్యుడు. నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివారు. 'చిగురించే పాదం' అనే కవితా సంకలనం ప్రచురించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో మాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

రచయిత. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1997లో పుట్టారు. తొలి కథ 'చిల్డ్రెన్స్ డే వెలుగు పత్రికలో ప్రచురితమైంది. తన చుట్టూ ఉన్న జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించడమే తన పని అంటారు. బీటెక్ చదివారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.

జ‌న‌నం: నెల్లూరు జిల్లా లింగ‌స‌ముద్రం. అస‌లు పేరు: కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. 'మ‌హాస్వ‌ప్న' క‌లం పేరుతో దిగంబ‌ర క‌విగా మారాడు. కావ‌లిలో చ‌దువుకున్నాడు. 1964లో  'అగ్నిశిఖలు... మంచుజడులు' క‌వితా సంపుటి ప్ర‌చురించారు.

1962 లో పుట్టారు. తెలుగు సాహిత్య విమర్శపై డాక్టరేట్ చేశారు. తొమ్మిది పుస్తకాలు అందులో ఐదు కవితా సంపుటాలు ప్రచురించారు. ఎనిమిదేళ్లుగా కవిసంగమం ''కవిత్వ వేదిక''ను నిర్వహిస్తున్నారు. ''రొట్టమాకురేవు పోయెట్రీ స్పేస్ ఫౌండేషన్'' ను స్థాపించి కవులకు అవార్డులు ఇస్తున్నారు. ముప్ఫై ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు.

తాళ్లపేట గ్రామం, మంచిర్యాల జిల్లా. గ్రామీణ నేపథ్యం, గిరిజనుల సాంగత్యం. ఎమ్మెస్సీ (జువాలజీ) చదివారు. ఏడేండ్ల పాటు లెక్చరర్ గా పనిచేశారు. గిరిజనుల జీవితం, వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు. తెలంగాణ జీవభాషలో రాయడం ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం మీడియాలో పనిచేస్తున్నారు.

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం గుంటూరుపల్లి. కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు: అవ్వ జెప్పిన తొవ్వ (దీర్ఘ కవిత), పాదముద్రలు, వెన్నెల వర్షం( పాటల సీడీ), గురి (దీర్ఘ కవిత ). వరంగల్ సీకేఎం కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

స్వస్థలం వరంగల్. కవి, రచయిత. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(ఇంగ్లిష్), సీకేఎం ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు.

 

 

 

రచయిత, సినీ డైరెక్టర్. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో ఎం. ఏ, ఎం. ఫిల్ చేసారు. సినిమా రచయితగా ఏడు సినిమాలకు కథ, మాటలు అందించారు. చెంబు చిన సత్యం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల అనాహత అనే కవితాసంపుటి తెచ్చారు.

యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. కవి. రచనలు :'మీనార్' (2011 2), 'దుఆ' (2013) , 'మూలవాసి' (2016 ) కవితా సంపుటాలు ప్రచురించారు. వివిధ డైలీ, వార, పక్ష, మాస పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. 'అబాబీల్ సాహిత్య వేదిక' కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  ఉన్నారు.

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

రచయిత, రిటైర్డ్ ప్రిన్సిపల్. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. రచనలు: విధ్యంసక అభివృద్ధి (అనువాదం) తొలి తెలగాణం, భూంకాల్ తిరుగుబాటు (అనువాదం) షోయబుల్లా ఖాన్, Song of Furrows (Translation) River- the Song of Tomorrow (Tr) Father! Grow up Like Me! (Trans.) వీక్షణం పత్రిక సంపాదక వర్గ సభ్యుడు. పాలమూరు పత్రిక సంపాదకుడు (ప్రచురణ ఆగిపోయింది). ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి కో- చైర్మన్

పెద్దపల్లి జిల్లా మంథని. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వివిధ పత్రికలు, ఆన్లైన్ మ్యాగజీన్ లలో దాదాపు 300 వ్యాసాలు, 50 కవితలు ప్రచురితమయ్యాయి.

రాప్తాడు, రాయలసీమ. కవి, కథకుడు, అధ్యాపకుడు, విరసం సభ్యుడు. ఇంగ్లిష్ లిటరేచర్ లో పీజీ చేశాడు. కొంతకాలం కర్నూల్ లో లెక్చరర్ గా చేరి, అక్కడ పిల్లలపై అమలయ్యే హింస, అణచివేత సహించలేక బయటికి వచ్చాడు. 1994లో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చేరాడు. కొద్దికాలంలోని మళ్లీ రాయలసీమకు వెళ్లాడు.  బెత్తాలు,  హోం వర్క్ భారాలు, అర్థంకాని వర్ణింపుల్లేని బోధన అతని ఆశయం. పాఠశాలల్లో పిల్లలపై కొనసాగే హింసను ద్వేషించాడు. కర్నూల్ జిల్లా కథా సాహిత్యం కోసం తపనపడ్డాడు. పల్లె మంగలి కతలు, ఫ్యాక్షన్ కతలు తీసుకువచ్చాడు. రచనలు: `యేదీ యేక వచనం కాదు`(కవిత్వం), `అతడు బయలుదేరాడు` (కథలు). 9 సెప్టెంబర్ 1999లో ఆత్మహత్య చేసుకున్నాడు.

పుట్టింది కరీంనగర్ జిల్లా మానకొండూర్ గంగిపల్లి. కవి, అధ్యాపకుడు, చరిత్ర పరిశోధకుడు. కలం పేరు ఆర్క్యూబ్. రచనలు: 'పాలపిట్ట' , 'వాన కోయిల' (కవిత్వం). జనగామలో ఉంటున్నారు.

రచయిత్రి, జర్నలిస్ట్.

రేణుక అయ్యలసోమయాజుల. కటక్ (ఒరిస్సాలో) జన్మంచారు. హైదరాబాదులో నివసిస్తున్నారు. రేణుక అయోల అన్న కలంపేరుతో ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాలు, 'పడవలో చిన్ని దీపం' (2006), 'రెండు చందమామలు' (2008, కధాసంపుటి), 'లోపలి స్వరం' (2012), 'మూడవ మనిషి' (2015, దీర్ఘ కావ్యం (హిజ్రాల వ్యధ)), అంతః తీరాల అన్వేషణ (2018), సౌభాగ్య (రేణుక అయోల కవిత్వ విశ్లేషణ), ఎర్ర మట్టి గాజులు (2019).

రేల అమెరికాలోని ఇండియనాపోలిస్ లో అయిదో తరగతి చదువుతుంది. హాబీస్: ఆర్ట్ వేయడం, jewelry తయారు చేయడం, టి‌వి చూడడం, అప్పుడప్పుడూ కథలు, కవితలు రాయడం.

పుట్టింది అనంతపురంలో.  అక్కడి వింతైన, విచిత్రమైన గాథలను వింటూ పెరిగాడు.  వృత్తి రీత్యా డాక్టర్. తెలుగు నుండి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదాలు చేయటం, ఇంగ్లిష్ లో కవిత్వం రాయటం చేస్తుంటాడు.  కవిత్వాన్ని చాలా వరకు ఫేస్బుక్ లో పెడుతుంటాడు.  తన కవిత్వం The Bombay Literary Magazine, The Punch, Sunflower Collective తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

నివాస ప్రాంతం కర్నూలు. కవయిత్రి, కథా రచయిత. వివిధ పత్రికల్లో కవిత్వం, కథలు ప్రచురితమయ్యాయి. రచనలు: 'రెప్పచాటు రాగం'(మొదటి కవితా సంపుటి).

నివాసం హైదరాబాద్. కవయిత్రి. బీఏ చదివారు.  తొలి కవితలతో 'కలం సవ్వడి' అనే సంపుటిని ప్రచురించారు. 'లేడి లెజెండ్' అవార్డ్ తో పాటు గురజాడ, రాష్ట్ర, జాతీయ స్థాయి, బిలాయి వాణి, రాధేయ ఉత్తమ‌ కవితా పురస్కారాలు పొందారు.

జననం: హనుమకొండ. అసలు పేరు గంగాధర రాజలోచన్. తిరగబడు కవి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తొలగించి,  జైలులో నిర్బంధించింది. రచనలు: 'మానవీయ శ్రీశ్రీ', 'మన కాళోజీ', 'ఆదాబ్ హైద్రాబాద్'. 1994 లో‌ ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ చేసారు.

 

పుట్టిన ఊరు సిద్ధిపేట, పూర్వపు మెదక్ జిల్లా.  కవి, రచయిత, విరసం సభ్యుడు. ఎమ్మెస్సీ(భౌతికశాస్త్రం) చదివారు.  విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వివిధ పత్రికల్లో కవిత్వం, వ్యాసాలు, పాటలు ప్రచురితమయ్యాయి. రచనలు: వసంత మేఘం(కవిత్వం)

 

 

 

చిన్నప్పటి నుండి సాహిత్యంపై అభిరుచి ఎక్కువగా వుండేది. దాంతో చిన్నప్పటి నుండే స్కూల్లో కవితలు, వ్యాసాలు వ్రాసేవాడు.

తెలంగాణ ఉద్యమ కాలంలో వివిధ పత్రికలలో కవితలు, కథలు ప్రచురించబడినవి. అందులో కథలు

* నమస్తే తెలంగాణ బతుకమ్మ లో 1) వాలిన పొద్దు 2) రాగం మార్చిన కోయిల 3) సంబురాల పండుగ 4) దేవక్కపెండ్లి 5) రంగుల గూడు
* ఆంధ్రభూమిలో 6) తీపిజ్ఞాపకం
* నవతెలంగాణ సోపతిలో 7) స్వేదవేదం
* నేటి నిజంలో 8) వాత్సల్యం 9) కొత్తరైతు వంటి కథలు వచ్చినవి.

సంగిశెట్టి శ్రీనివాస్ గారు సింగిడి తెలంగాణ రచయితల సంఘం "తెలంగాణ కథ 2017 దావత్" కథా సంకలనంలో "రంగుల గూడు" కథను వేశారు. 2022 లో 'చుక్కల పందిరి' కవితా సంకలనం ప్రచురితమయింది.

పుట్టింది వేములవాడ, కరీంనగర్ జిల్లా. కవి, రచయిత. రచనలు: 1. లయ(మిత్రులతో కలిసి), 2. గోగుపువ్వు,  3. పాలకంకుల కల, 4. దాఖలా,  5. కలల సాగు, 6.  'ఆఖ్రీ మౌఖా' (ఎంపిక చేయబడిన కవితల హిందీ అనువాదం)

 

గుంటూరు జిల్లా వినుకొండ స్వగ్రామం. ఉపాధ్యాయురాలు. తెలుగు సాహిత్యంలో డిగ్రీ, ఎంఏ, డీఎడ్, బీఎడ్ చదివారు. వినుకొండలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు)గా పనిచేస్తున్నారు. విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని బోధించడం అత్యంత ఇష్టం.

పుట్టింది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, మునిగలవీడు. పరిశోధక విద్యార్థి. ఎం.ఏ(జర్నలిజం), ఎం.ఏ(తెలుగు) చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన (పీఎచ్ డీ) చేస్తున్నారు.

జ‌న‌నం: వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి.పెరిగింది నెక్కొండ. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. విర‌సం స‌భ్యుడు. తెలుగు సాహిత్యంలో తనదైన తెలంగాణ భాష ముద్రతో కవిత్వం, కథలు రాస్తున్న కవి. 'ముఖచిత్రం', 'పడావు', 'జంగ్-ఏ-కాశ్మీర్', 'హిమాలయాలే వడ్ల తాలయిన అమరత్వం', 'వీరవనం', 'హైదరాబాద్ నా అబ్బ సొమ్మె', 'ర్యామాండం' తదితర దీర్ఘ కవితలు, 'పోస్ట్ మార్టం రిపోర్ట్', 'దుఃఖభాష', 'చెమట చుక్కల కళ్లు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'పబేటు వల', 'ఆమె తలాఖంది' తదితర 20 కథలు రాశారు.

జననం: వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల. ఉద్యోగరీత్యా వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా పనిచేశాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. రచనలు: చలినెగళ్లు (1968), జీవనది (1970), ఊరేగింపు (1973), స్వేచ్ఛ (1977), స్వేచ్ఛ (1977), భవిష్యత్ చిత్రపటం (1986), ముక్త కంఠం (1990), ఆ రోజులు (1998), ఉన్నదేదో ఉన్నట్లు (2000), ఉన్నదేదో ఉన్నట్లు (2000), బాగ్దాద్ చంద్రవంక (మార్చి 2003), మౌనం యుద్ధ నేరం (ఏప్రిల్ 2003).

అర్థవంతమయిన సినిమాలూ, సాహిత్యం ఇష్టం. నాలుగు దశాబ్దాలు ఫిల్మ్ సొసైటి ఉద్యమంలో పని చేసారు. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి సొంత ఆడిటోరియం నిర్మాణం లో ప్రధాన భూమిక పోషించారు. సినిమాలపైన ‘నవ్యచిత్ర వైతాళికులు’, ’సినీ సుమాలు’, ’24 ఫ్రేమ్స్’, ’ బాలల చిత్రాలు’, 'బంగారు తెలంగాణలో చలనచిత్రం’, 'తెలంగాణ సినిమా దశ-దిశ’ పుస్తకాలు రాసారు. కవితా సంపుటులు మనిషి లోపల, అక్షరాల చెలిమె, ముక్తకాలు, గుల్జార్ కవితానువాదం 'ఆకుపచ్చ కవితలు' వెలువరించారు. ఆనంద్ కవిత్వం ఇంగ్లీష్ లో  ‘Signature of Love', తమిళంలో ‘అన్ బిన్ కైచందు’ పేర సంకలనాలుగా వెలువడ్డాయి. కన్నడానువాదం ప్రచురణకు సిద్ధంగా వుంది. ఆయన పలు డాక్యుమెంటరీ ఫైల్మ్స్ కి దర్శకత్వం వహించారు. అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.   

కవి, రచయిత

కథా రచయిత. చెన్నైలో పుట్టి, నెల్లూరులో స్థిరపడ్డారు. రచనలు: పక్షి (2004), ఖండిత (2008), సుప్రజ (2001) కథా సంకలనాలు), రెండు భాగాలు (2008) కవితా సంపుటి ప్రచురించారు.

విద్యార్థిని. నారాయణపేట జిల్లా, మాగనూరు మండలంలోని వడ్వాల్ గ్రామం. తండ్రి అంజప్ప. పుస్తకాలు చదవడం, వాటిని కొత్తచూపుతో అర్థం చేసుకోవడం ఇష్టం. వడ్వట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

రంగారెడ్డి జిల్లా, వనస్థలిపురం. కవయిత్రి, కథా రచయిత. అధ్యాపకురాలు. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, కర్నూల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రచనలు: నానీల సింగిడి. కవిత్వం, కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

పుట్టింది పెరిగింది ఖమ్మం జిల్లా గ్రామీణం లో. ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్నది హైదరాబాద్ లో. విద్యార్థిగా, కార్మికుడిగా, కార్మికోద్యమ కార్యకర్తగా, గ్రూప్ 1 అధికారిగా రూపాంతరం చెందినప్పటికీ తనను తాను భావజాల రంగ కార్యకర్తగా మలచుకొని చెప్పదలచుకున్న అంశాన్ని కవిత, కథ, వ్యాసం, వంగ్యం... దేనిలో అంశం సమర్థంగా ఆవిష్కృతమౌతుందనుకుంటే, పాఠకుడికి సులభంగా చేరుతుందనుకుంటే ఆ ప్రక్రియలో రచనలు చేస్తుంటారు.

పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్రక్కిలంక, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పెరిగింది అంతా విశాఖపట్నంలోనే. రచయిత్రి, కవయిత్రి, వ్యాసకర్త,  academician, హ్యుటగాజీ practitioner, ప్రరవే సభ్యురాలు.

రిటైర్డ్ ప్రొఫెసర్ జె.ఎన్.టి.యు. అరుణోదయ రామారావుతో కలిసిపనిచేసిన ఒకప్పటి సాంస్కృతిక సహచరుడు.

పుట్టింది హైదరాబాద్. కవయిత్రి. కథా రచయిత్రి. ఉద్యమ కార్యకర్త. కవితా సంకలనాలు: 'అడవి ఉప్పొంగిన రాత్రి', 'మృగన'. కథా సంకలనం: 'కొన్ని నక్షత్రాలు... కాసిన్ని కన్నీళ్లు'

పుట్టింది గుంటూరు జిల్లా పెసర్లంక. అసలు పేరు ఝాన్సీ కమ్మెల. విరించి లక్ష్మి పేరుతో రచనలు చేస్తున్నారు. కవయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది. బీఏ, ఎల్ ఎల్ బీ, సైకాలజీ చదివారు.

 

 

 

అసలు పేరు వి.సాయివంశీ. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా మహబూబ్‌నగర్ జిల్లాలో. 2019లో మొదలుపెట్టి ఇప్పటికి ఆరు కథలు రాశాను. 15 లైన్లలో కథ చెప్పే ప్రక్రియలో భాగంగా 30 దాకా 'మైక్రో కథలు' రాశాను. కథలు రాయడాన్ని, చదవడాన్ని ఇష్టపడతాను. జర్నలిజం వృత్తి.

జననం: బ్రాహ్మణ వెల్లెంల, నార్కెట్ పల్లి మండలం, నల్లగొండ జిల్లా. కవి, రచయిత.  విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకుడు. రచనలు: నరమాంస భక్షణ(దీర్ఘ కవిత), కైవారం.

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేస్తున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

పుట్టిన ఊరు: కనగర్తి. ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. SRR డిగ్రీ కాలేజీ కరీంనగర్ లో బీ.కామ్ . చదివి కాకతీయ విశ్వవిద్యాలయంలో బీ.ఎడ్ చేసారు.
సాహిత్యం పరిచయం: చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ పాటలు, పాఠశాల స్థాయిలో ఠాగోర్ జీవిత చరిత్ర(7వ తరగతి తెలుగు ఉపవాచకం), గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర(ఇంటర్ లో), డిగ్రీ చదివేటపుడు మాక్సిం గోర్కీ అమ్మ, నేను హిందువునెట్లయిత?, చలం సాహిత్యం.
రచనలు: 'ఒక మూల్నివాసీ గీతం' పేరుతో త్వరలో కవితా సంకలనం రానుంది. 'మహానీయుల జీవిత చరిత్ర'ల వ్యాసాలు (దినపత్రికల్లో). ప్రస్తుతపు కథ ఆరవది . మంచిర్యాల్ జిల్లా జన్నారం తహసీల్దార్ గా పనిచేస్తున్నారు.

 

హక్కుల కార్యకర్త, కార్మికోద్యమ నాయకుడు. అకడమిషియన్.

రచయిత, దర్శకుడు, నిర్మాత. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదివారు. సిద్ధిపేటలో 90వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్ఫూర్తితో సాహిత్యంలోకి వచ్చారు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రధాన వృత్తిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రవృత్తి గా కథా రచన, సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకున్నారు. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమాలు ఎంతెంతదూరం, అవతలివైపు, పిలుపు, మై డాడ్. ప్రొడ్యూసర్ గా నిర్మించిన లఘు చిత్రం ఎక్స్చేంజ్, కాక్టైల్ డైరీస్ అనే ఎనిమిది ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి. రచనలు: మౌనసాక్షి (మొదటి కథా సంకలనం), అరుగు(కథా సంకలనం), శ్రీగీతం (నవల) కొన్ని రోజుల్లో రానున్నాయి. వివిధ పత్రికల్లో కథలు, పాటలు, కవిత్వం అచ్చయింది. రెండు దశాబ్దాల క్రితం అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో స్థిరపడ్డారు. లఘు చిత్రాలు ఈ యూట్యూబ్ లింక్ లో చూడొచ్చు https://youtu.be/S717rCUReoc

కవి,  రచయిత.

ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పిల్లలన్నా , పుస్తకాలన్నా , బొమ్మలన్నా చాలా ఇష్టం.

నివాసం విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు, జర్నలిస్టు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నారు. 2019 లో ' ఏడవ రుతువు' కవితా సంపుటి వచ్చింది.

నాలుగు దశాబ్దాలకు పైగా అనువాద రంగంలో కృషి చేస్తున్నారు. కథ, కవిత, నవల, నాటకం, వ్యాసాలు, ఆత్మకథలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు. కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల 'చదువు'ని హిందీలోకి అనువదించారు. ఈమె చేసిన అనువాదాలలో, 'మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు', ' అసురుడు', డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ, 'బేబీ హాల్దార్ జీవిత చరిత్ర' వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నోకవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో అనువదించారు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించారు. సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంత సుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

పుట్టింది కలికివాయ, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కార్యక్షేత్రం: ఉపాధ్యాయుడు పి. నాయుడుపాలెం, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. సాహిత్యం: కవితలు 'వసంతాల ఊసెత్తకు', 'నీటి పొద్దు', 'మేం పావురాల్ని ప్రేమిస్తాం' సంకలనాలు. కథలు: 'మిత్తవ', 'మారాజులు' సంకలనాలు. 'గబ్బగీమీ చీకటి' నవల. ప్రస్తుతం పి. నాయుడు పాలెం గ్రామంలో పిల్లలతో విద్య పై ప్రయోగాలు.

జ‌న‌నం: త‌ల్లాడ‌, ఖ‌మ్మం జిల్లా. ర‌చ‌యిత్రి. క‌డ‌ప జిల్లా బ్ర‌హ్మంగారి మ‌ఠంలో పెరిగారు. అక్క‌డే బీఏ వ‌ర‌కు చ‌దివారు. 1997 నుంచి క‌విత్వం, క‌థ‌లు రాస్తున్నారు. వివిధ ప‌త్రిక‌ల్లో క‌థ‌లు, క‌విత‌లు ప్ర‌చురిత‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో ఉంటున్నారు.

పుట్టిన ఊరు కృష్ణా జిల్లా నూజివీడు. కవి, రచయిత, అధ్యాపకుడు. అసలు పేరు కత్తుల కిశోర్ కుమార్.  ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి.(తెలుగు) పూర్తి చేశారు. రుక్మిణి ప్రసన్నను ఆదర్శ వివాహం చేసుకున్నారు. డిగ్రీ కాలేజీలో పదేళ్లు తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. ప్రస్తుతం అరసం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, "నెలవంక" సాహిత్య మాసపత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

 

పుట్టింది గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో.. నివాసం గుంటూరు. ఎంఏ తెలుగు పూర్తి చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. పరిశోధక విద్యార్థినిగా రచనలు చేస్తున్నారు. పలు సదస్సుల్లో పరిశోధక పత్రాలను సమర్పించారు. సామాజిక స్పృహ ఉన్న రచనలు చదవడం, రాయడం ఇష్టం.

పుట్టింది ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, చవటపాలెం. తాను ప‌నిచేస్తున్న‌చోట స‌హ‌చ‌ర కార్మికుల జీవితాల‌ను క‌థ‌లుగా మ‌లుస్తున్న‌క‌థ‌కుడు. ప్ర‌స్తుతం మైనింగ్ ఫోర్ మ‌న్ గా ప‌నిచేస్తున్నాడు.

పుట్టింది శంషాబాద్. కవయిత్రి, వక్త, విమర్శకురాలు. విశ్రాంత అధ్యాపకురాలు. మూడు దశాబ్దాలకు పైగా వక్తృత్వం,  కాలమ్స్, విమర్శ రాస్తున్నారు.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

కథా రచయిత, జర్నలిస్టు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో జర్నలిజం పాఠాలు చదివాను. ఇరవయ్యేళ్ల వయసులో ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో చేరి, ఆ పత్రిక ఫీచర్స్ డెస్కులో సబెడిటర్ గా కెరీర్ ప్రారంభించారు. సండే మ్యాగజైన్ ‘స్నేహ’ లో క్యాంపస్ ఛాట్ శీర్షిక నిర్వహించారు. టీవీ9లో కొంతకాలం పనిచేశారు. పెళ్లయ్యాక సాప్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టారు. మళ్లీ సాహిత్యాభిలాషతో కథలురాయడం ప్రారంభించారు. మొదటి కథ ‘గాజుబొమ్మ’ విహంగ పత్రికలో ప్రచురితమైంది. పెళ్లి పేరుతో స్త్రీలపై జరిగే హింసను వివరించే ‘విముక్తి’, ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొనే వివక్షను చూపే ‘ఓ శిరీష్ కథ’ విహంగలోనే పబ్లిషయ్యాయి. స్త్రీలపై, హిజ్రాలపై జరుగుతున్న హింస, వివక్షలపై సమాజంలో అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

పుట్టింది గౌరీపట్నం (పశ్చిమ గోదావరి జిల్లా), ప్రస్తుతం హైదరాబాద్ లో ఫ్రీలాన్స్ రైటర్, పోస్టర్ డిజైనర్ గా పని చేస్తున్నాడు.

కవయిత్రి. రచయిత్రి. రచనలు : చేతి చివర ఆకాశం (కవిత్వం), మన చరిత్ర - సంస్కృతి భిన్న కోణాలు. వివిధ పత్రికల్లో కవిత్వం, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

పనిచేసేది కంప్యూటర్ తెర పైన అయినా పుస్తకాలతో పెనవేసుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటాడు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్ల రద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్ల జాతీయులపై జాతి వివక్ష ఇలా ఓ పిడికెడు పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు మొత్తం మీద ఏడెనిమిది వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో రాసే ‘కతల సేద్యం’ చేసే పనిలో ఉన్నాడు.

రాయలసీమ. కవి, రచయిత.  పనిచేసేది కంప్యూటర్ తెర పై. అయినా పుస్తకాలతో పెనవేసుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటాడు. ఇప్పటి వరకు 'పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం', 'నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు', 'అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష'... ఇలా ఓ పిడికెడు పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు మొత్తం మీద ఏడెనిమిది వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాస పత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో  ‘కతల సేద్యం’ చేసే పనిలో ఉన్నాడు.

స్వస్థలం హైదరాబాద్. క‌వి, అధ్యాప‌కుడు. వివేక వ‌ర్ధిని క‌ళాశాల‌(హైదరాబాద్)లో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. 'కొన్ని సమ‌యాలు', 'ఇత‌ర', 'శ్రీకాంత్  (Selected Poems 2013-18, Vol i ), Saudade (Long Poem) అనే క‌వితా సంపుటాలు వ‌చ్చాయి.

ప్యాపిలి గ్రామం, కర్నూలు జిల్లా. 'కర్నూలు మూర్తి'గా కథా ప్రపంచానికి పరిచితుడు. కర్నూలులో కథ పునర్వికాసానికి కృషి చేసినవారిలో ఒకడు. శ్రీనివాసమూర్తి బృందం పాతికేళ్ల కిందట తీసుకొచ్చిన 'పల్లె మంగలి కతలు, ఫ్యాక్షన్ కతలు' పుస్తకాలు కర్నూలు వైపు కథా పాఠకుల చూపును మళ్లించాయి. శ్రీనివాసమూర్తి రాసిన ‘అడివోడు”, ‘మెడమీద వేలాడే కత్తి’, కథ -95, కథ -96 సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఇటీవల కశ్మీర్ నేపథ్యంగా రాసిన “ఖబర్ కె సాత్’ కథ కథాసాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పటిదాకా సుమారు పదహైదు కథలు రాసిన శ్రీనివాసమూర్తి పుట్టింది కర్నూలు జిల్లా ప్యాపలి గ్రామంలో. ప్యాపలి, ద్రోణాచలం, గద్వాల, కర్నూలు, తిరుపతిల్లో పి.హెచ్.డి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం రసాయనశాస్త్ర అధ్యాపకులుగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పనిచేస్తున్నారు.

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

ఊరు సిరిసిల్ల. సాహితీ ప్రియుడు. ఆఫ్రికా లో రెండు దశాబ్దాలు అధ్యాపకుడు గా పనిచేసాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం.

పేరు కంచర్ల శ్రీనివాస్. ఊరు ఖమ్మం. కవి, జర్నలిస్ట్. 'సూఫీ' కలం పేరుతో రచనలు చేస్తున్నారు. కవిత్వం, కథలు రాస్తుంటారు.

కలం పేరు ఉషారం. స్టేట్ బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. కవిత్వం, కథలు రాస్తారు.

ఆలేరు, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా. విశ్రాంత ఉపాధ్యాయుడు, చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు. పుస్తకాలు: మట్టి పొత్తిళ్ళు, మూలకం, రెండు దోసిళ్ళ కాలం(కవితా సంకలనాలు), పాడాలని(పాటలు), ఆలేటి కంపణం, ఠాకూర్ రాజారాం సింగ్ (చరిత్ర రచనలు), సాహిత్య వ్యాసాలు, కథలు, నాటికలు.

పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో 'కవితా ఓ కవితా' శీర్షిక నిర్వహిస్తున్నారు. 'అద్వంద్వం' తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

కవయిత్రి. హెల్త్ కేర్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. రచనలు: అమోహం(కవిత్వం), రెక్కల పిల్ల(కథల సిరీస్). ప్రస్తుతం జమైకాలో ఉంటున్నారు.

పుట్టింది కడప జిల్లా ప్రొద్దటూరు. రచయిత్రి. విరసం సభ్యురాలు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో M.A.Women's studies చదివారు. ప్రస్తుతం ఎంసీజే చదువుతున్నారు.

కవయిత్రి, కథా రచయిత. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 'ముస్లింవాద కవిత్వం - వస్తు రూప వైవిధ్యం'పై (ఎం.ఫిల్), 'తెలుగులో ముస్లింవాద సాహిత్యంపై' (పీహెచ్ డీ) పరిశోధన చేశారు. రచనలు: నఖాబ్ (ముస్లిం స్త్రీ కవిత్వం), చాంద్ తార(స్కైబాబతో కలిసి), దర్దీ కవితా సంకలనాలు ప్రచురించారు. అలావా(ముస్లిం సంస్కతి కవిత్వం)కు సహ సంపాదకులుగా ఉన్నారు. పది కథలు, ఎన్నో వ్యాసాలు రాశారు. 'తెలుగులో ముస్లింవాద సాహిత్యం' పుస్తకం రాబోతున్నది.

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

నల్గొండ జిల్లా ఆలేరు మండలం రఘునాథపురం లో జన్మించారు. ప్రస్తుతం మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ గా పని చేస్తున్నారు .తెలంగాణ సాహిత్య పరిశోధన చరిత్రలో తనదైన ముద్ర వేశారు. పలు పుస్తకాలను వెలుగులోకి తెచ్చి ప్రచురించారు. తెలంగాణ సాహిత్య విమర్శ, పరిశోధనలో కృషి చేస్తున్నారు.

కవి, రచయిత.

పుట్టింది పూర్వపు నల్లగొండ(సూర్యాపేట) జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం. అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల నుండి తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేపథ్యం. వివిధ పత్రికల్లో సామాజిక, రాజకీయ, అంతర్జాతీయ అంశాల పై వ్యాసాలు రాస్తున్నారు. "తెలంగాణా సమగ్ర చరిత్ర" సహ రచయిత. "వీక్షణం" మాస పత్రిక ఎడిటోరియల్ కలెక్టివ్ సభ్యుడు.

జననం: రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ .  కవి , విశ్రాంత ఉపాధ్యాయుడు. కవిత్వంలో ఫోటోగ్రఫీ, ఫొటోగ్రఫీ లో కవిత్వం వెతుక్కోవడం హాబీలు.

పుట్టింది నెల్లూరు జిల్లా పురిణి. వృత్తి న్యాయవాది. ప్రవృత్తి జర్నలిజం. రెండు దశాబ్దాల పాటు 'ఉదయం', 'వార్త' దినపత్రికల్లో, 'సిటీ కేబుల్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్' లో పలు బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో పలు కవితలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 18 పుస్తకాలు రాశారు. వీటిలో కొన్ని ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇందులో ఏడు చరిత్ర పుస్తకాలున్నాయి.  ప్రస్తుతం గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉంటున్నారు.

పుట్టిన ఊరు ఎర్రగొండపాలెం. ప్రస్తుత నివాసం ఒంగోలు. కవి, రచయిత, జర్నలిస్టు.  సాహిత్యం : ఖిబ్లా ( సంపాదకత్వం), జంగ్ ( సంపాదకత్వం ), నిప్పు ( సంకలనం ), ఒక దేశద్రోహి ప్రేమ కథ ( సంకలనం ), కథలు : లాకప్ డెత్,  ప్రతిజ్ఞ, నీకి - నాకి, ధక్కా.

పుట్టిన ఊరు: నారాయణపూర్, మం౹౹సుల్తానాబాద్, జి౹౹పెద్దపల్లి. విద్య: B. Com. వృత్తి: అంగన్వాడీ టీచర్. రచనలు: పల్లె ముచ్చట్లతో కొన్ని వ్యాసాలు, కవితలు, స్త్రీవాద వ్యాసాలు, సమీక్షలు, కథలు రాశారు. మొదటి కథ సదువు ఇమ్మర్స, గల్పికా తరువు పుస్తకం లో 2020 లో ప్రచురించారు. 'లేఖావలోకనం' (మరణించిన తన తల్లికి లేఖ) 2021 లో ప్రచురించారు.

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

స్వస్థలం మంచిర్యాల, విద్యార్థిని. పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, కవిత్వం రాయడం హాబీలు. ఐదో తరగతిలో " ఫేమస్ ఫైవ్ " అనే పుస్తకాన్ని చదివిన తరువాత సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది. చదువుతో పాటు మానసిక పరిణితి కోసం సాహిత్యాన్ని చదువుతోంది.

కవయిత్రి, కథా రచయిత, విమర్శకురాలు. రాజకీయ విశ్లేషకులు. పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె. నెల్లూరులో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం. ఏ (తెలుగు సాహిత్యం) చదివారు. అక్కడే 'అంటరాని వసంతం - విమర్శనాత్మక పరిశీలన' (ఎం.ఫిల్.); 'తెలుగు ముస్లిం రచయితలు - సమాజం - సంస్కృతి'పై పరిశోధన చేసి, డాక్టరేట్ పొందారు. రచనలు : కొత్తగూడెం పోరగాడికో ప్రేమలేఖ (కథలు), టీ తోటల ఆదివాసీలు చెప్పిన కథలు, సరళ సుందర సునిశిత మమత ( మమతా బెనర్జీ కవిత్వం అనువాదం); సంపాదకత్వం : ప్రాతినిధ్య, వార్షిక (ఉత్తమ తెలుగు కథలు); సాక్షి దినపత్రికలో 'ఆలోచనం' రాజకీయ కాలమ్ రాశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ డిగ్రీ కాలేజీలో పదేళ్లపాటు లెక్చరర్ గా పనిచేశారు. ప్రస్తుతం కలకత్తాలో ఉంటున్నారు.

జ‌న‌నం: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. క‌వి, జ‌ర్న‌లిస్టు. 2013లో బీటెక్ పూర్తి చేశాడు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నాడు. 2018లో 'ఒక...' పేరుతో కవిత్వ సంకలనం తెచ్చాడు. 2016లో ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు 'జీవన' పేరుతో నడిచే ప్రజాశక్తి ఫ్యామిలీ పేజీకి ఫీచర్స్ రాశాడు. ఇప్పుడు మోజో టీవీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఒక దీర్ఘకవితను తీసుకొచ్చే పనిలో ఉన్నాడు.

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

సామాజిక కార్యకర్త. శాతవాహన యూనివర్సిటి , కరీంనగర్, సామాజిక శాస్త్రం విభాగాధిపతి. ఉస్మానియా యూనివర్సిటి నుండి 'దళిత మహిళా సాధికారత' పై పి.హెచ్. డి చేసారు. కులం, జెండర్, పర్యావరణం, మానవ హక్కుల పై అనేక వ్యాసాలు, పుస్తకాలు వేసారు. అనేక సామాజిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటూ, నిర్మిస్తూ బహుజన ప్రతిఘటన వేదిక, భూమి రక్షణ సంఘం కన్వీనర్ గా ఉన్నారు. 'దేశి దిశ' పత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

జననం: పాలమూరు జిల్లా. కవి, రచయిత. విరసం సభ్యుడు. రెండు కవితా సంపుటాలు ప్రచురించారు.

జననం: ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం, గన్నవరం గ్రామం. డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి వుద్యోగ విరమణ పొందారు. పల్లెలన్నావ్యవసాయమన్నా ఇష్టం. రచనలు: లోయలో మనిషి (1997), తొలకరి చినుకులు(2001), చల్లకవ్వం (2002), రెప్పల చప్పుడు(2004), తదేకగీతం(2006), పచ్చని వెన్నెల(2007), మట్టి పొరల్లోంచి (2018), చేను చెక్కిన శిల్పాలు (2019). 2007 నుంచి గుంటూరు జిల్లా రచయితల సంఘం అధ్యకుడిగా, 2015 నుంచి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యకుడిగా వ్యవహరిస్తున్నారు. 'రమ్యభారతి' సాహిత్య త్రైమాసిక పత్రిక సహకారంతో 2007 నుంచి చిన్న కథల పోటీలు నిర్వహించి 'సోమేపల్లి సాహితీ పురస్కారం' అందచేస్తున్నారు.

2017 లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ప్రస్తుతం న్యాయవాదిగా పని చేస్తున్నారు.

కవయిత్రి, కథా రచయిత. న్యూస్ ప్రజెంటర్. రచనలు: మట్టిపూల గాలి(కవిత్వం). ఓ న్యూస్ చానెల్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తున్నారు.

కవి, కథకుడు. సామాజిక కార్యకర్త. రచనలు : 1. ఇక ఊరు నిద్రపోదు (కవిత్వం) 1995, 2. ముఖౌటా (గుజరాత్ జీనోసైడ్ పై కవిత్వ సంపుటి) 2002, 3. నాది దుఃఖం వీడని దేశం (2021); కథలు : 1. పడమటి నీడ (1999), 2. ఇప్పుడే వస్తా (2022) కథా సంపుటాలు వెలువడ్డాయి.

ఖమ్మం జిల్లా. కవి, జర్నలిస్టు. చిన్నతనం నుంచి గిరిజన గ్రామాల్లో పెరిగారు. కాలేజీ రోజుల్లో భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ ఎఫ్ ఐ)లో పనిచేశారు. తెలుగు యూనివర్సిటీలో ఎంసీజే చదివారు. జర్నలిజంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టీవీ 9 స్థాపించిన టీమ్ లో ముఖ్యులైన  అరుణ్ సాగర్ తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం టీవీ 9 లో పని చేస్తూ తీరిక సమయాల్లో కవిత్వం రాస్తున్నారు.

స్వస్థలం ప్రకాశం జిల్లా పెదమోపాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి బోధనా రంగంలో వున్నారు. అంతర్ బహిర సంఘర్షణలు కథనం చెయ్యటం లో ఆసక్తి. దాదాపు డజను పైగా కథలు రాసారు. ప్రస్తుత నివాసం నెల్లూరు.