వస్తువును కవిత్వంగా మలచడం ఓ కళ. వస్తువు ఒక్కటే కాదు అభివ్యక్తి శిల్పం సైతం ప్రధానం. వస్తువు మీద మమకారంతో రచనకు…
Author: గుడిపాటి
జననం సూర్యాపేట. చదువు డిగ్రీ వరకు సూర్యాపేటలో. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఏ రాజనీతి శాస్త్రంలో చేరారు. ఎం.ఏ.లో స్వామి రామానంద తీర్థ బంగారు పతక విజేత. అనంతరం బిసిజె, బి.ఇడి చేశారు. ఇప్పటివరకు పది పుస్తకాలు అచ్చయ్యాయి. కలం పేరుతో మరో రెండు పుస్తకాలు వచ్చాయి. ఒక కవితా సంపుటి, రెండు జీవిత చరిత్రలు. మరొకటి ప్రపంచ సాహిత్యంలోని మేలిమి రచయితల పరిచయ వ్యాసాలు. మిగతావి విమర్శనా వ్యాసంగానికి సంబంధించిన పుస్తకాలు, కథారచన ఇష్టమైన వ్యాపకం. రాసింది కొన్ని కథలే. 'సంవిధానం' కథా సాహిత్య వ్యాసాల సంపుటి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ విమర్శనా గ్రంథంగా పురస్కారం పొందింది. కవిత్వం, కథ, విమర్శ, జీవితచరిత్ర ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. జర్నలిజంపై మమకారం, సాహిత్యంపై ఆసక్తి. చదువుకునే రోజుల్లో 'చైతన్యవాణి', 'ప్రజావాణి' లిఖిత పత్రికల నిర్వహణ. డిగ్రీలో ఉండగా 'స్రవంతి' సైక్లోస్టయిల్డ్ పత్రిక, పి.జి. అనంతరం 'ఉజ్వల' బులిటెన్ నిర్వహణలో కీలక భాగస్వామి. 'పాలపిట్ట బుక్స్' ఎడిటర్గా దాదాపు వందకు పైగా పుస్తకాలను ఎడిట్ చేశారు. 'పాలపిట్ట' మాసపత్రిక సంపాదకునిగా సాహిత్య జర్నలిజంలో కొత్త ఒరవడిని పాదుకొల్పారు. రచనలకు సంబంధించి వస్తే సాహిత్యం, సాహిత్యేతర రచనలు అనేకం చేశారు. సొంతంగా రాసిన వాటి కన్నా వివిధ కలం పేర్లతో చేసిన రచనలు అనేకం. వృత్తి: లెక్చరర్ కాబోయి జర్నలిస్టు అయ్యారు. ఉస్మానియాలో చదువుకునే రోజుల్లోనే కొంతకాలం 'సాయం కాలం' సాయంత్రపు దినపత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగం. పిజి పూర్తి చేశాక 'నలుపు' పక్షపత్రిక ఆరంభంలో కొన్నినెలలు ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళు లెక్చరరుగా ఉద్యోగం. అనంతరం 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో చేరి నాలుగేళ్ళు పనిచేశారు. తర్వాత 'వార్త'లో చేరారు. వివిధ విభాగాల్లో పని చేసినప్పటికీ సుదీర్ఘకాలం పాటు 'వార్త' ఆదివారం ఎడిటర్గా ఉన్నారు. ఫీచర్ జర్నలిజంలో నవీన ధోరణులని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 'నవతెలంగాణ' దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా పని చేస్తున్నారు.