కథలో రెండువైపులాఒకరి వేళ్ళు మరొకరి వైపు చూపిస్తుంటేవక్రీకృత సత్యాల చెరసాలలో అసలు నిజం చిక్కుబడిందిఎవడూ తేల్చిచెప్పడేం…నేనిప్పుడు నిర్బంధ శిబిరంలో శాశ్వత శిక్ష…
Author: తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
కవి, రచయిత. కృష్ణాజిలాల్లోని కాకులపాడు గ్రామంలో జన్మించారు. కాకులపాడు 'RCM' స్కూలులో ఐదవ తరగతివరకూ. ఆ తరువాత ఏలూరు సెయింట్ జేవియర్స్ స్కూలులో పదవ తరగతి వరకూ చదివారు. కాలేజీ విద్యను ఆంధ్ర లయోలా కళాశాలలోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 'DNR' కళాశాలలోనూ చదివి, ఉన్నత విద్యకోసం ఫిలిపైనె వెళ్లి అతేనెయో డి మనీలాలో 'MBA', బెల్జియంలోని 'Brugge' 5 'WES' 'Tourism Marketing planning' ໖໖. 'British Tourist Authority' లో టూరిజం ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే IT' ఢిల్లీలో 'Man-agement studies' డిప్లొమా, మనీలాలోని రేడియో వెరిటాస్ లో బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో డిప్లొమా తీసుకున్నారు. సికిందరాబాద్ లోని అమృతవాణిలో 1983-86 వరకూ జూనియర్ ప్రొడ్యూస గా ఉద్యోగ యాత్ర మొదలు పెట్టి శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కు రేడియో నాటికలు, పాటలు రాశారు. 1986-90 వరకు ఫిలిప్పైన్స్ లోని మనీలాలో అంతర్జాతీయ రేడియో స్టేషన్ రేడియో వేరిటాస్లో తెలుగు విభాగంలో ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహించారు. భారతదేశం తిరిగివచ్చాక సికిందరాబాద్లోని జ్యోతిర్మయి సొసైటీలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. జర్నలిజం మీద ఆసక్తితో 1995 లో కొద్దికాలం 'ఉదయం' దిన పత్రికలో జనరల్ డిస్క్ లో జర్నలిస్ట్ గా చేశారు. 1995 నుంచి 2017 వరకూ భారత పర్యాటక మంత్రిత్వ శాఖలో వివిధ హెూదాలలో పనిచేసి, 2017 లో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేశారు. మణిపూర్, కేరళ, హైదరాబాద్, బెంగుళూరు, జైపూర్ లలోనూ డైరెక్టర్గా చేశారు. కేవలం భారత దేశంలోనే కాకుండా, విదేశాలలో కూడా భారత పర్యాటక మంత్రిత్వ శాఖ తరపున జపాన్ లో 2001-04 వరకూ ఈస్ట్ ఏసియా డైరెక్టర్ గానూ, దుబాయ్, జోహాన్నెస్బర్గ్ (2008 -11 ) వరకూ మిడిల్ ఈస్ట్ ఏసియాకు, ఆఫ్రికా ఖండానికి రీజనల్ డైరెక్టర్ గా పనిచేశారు.