రాజద్రోహం

నేను రోజూ తరగతి గదిలో
పాఠం బోధిస్తూ ఉంటాను
‘మను చరిత్ర’ పాఠం లో
రాజ్యానికి ద్రోహం’ వినిపించింది.

నేను తెలంగాణ గోసను
ప్రజలతో సంభాషిస్తూ ఉంటాను
పోలీసులకు కుట్ర కనిపించింది.

నేడు తెలంగాణలో
రాలిపడుతున్న మాంసం ముద్దలకు
నాలుగు అక్షరాలు తొడుగుతాను,
పాలకులకు ‘చట్ట వ్యతిరేక మయ్యాను

తెలంగాణ కన్నీళ్లను కలంలో నింపడం
ద్రోహమైతే
నేను రాజద్రోహం చేయడానికి సిద్ధం

(నడుస్తున్న తెలంగాణ – జూన్, 2012)

పాలమూరు జిల్లా అంబట్ పల్లి. కవి, రచయిత, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు. విరసం సభ్యుడు. రచనలు: పొలమారిన పాలమూరు, గుత్తికొండ, మానాల(దీర్ఘ కవితలు), నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న, తెలంగాణ ఉద్యమాలు-పాట, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ-సామాజిక న్యాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు-విద్రోహ రాజకీయాలు, తెలంగాణ సాహిత్యం, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు; అగ్రకులత్వం, టీఎస్ఎఫ్ చరిత్ర, కాగితం మీద అక్షరానికి కమిటైన కవి, అకడమిక్ అన్ టచ్ బులిటీ. ఇరవయేళ్ల కవిత్వమంతా ''కాశీం కవిత్వం (1994 -2014)'' పేరుతో సమగ్ర సంకలనం ప్రచురించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

 

 

Leave a Reply