మతాలకతీతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం!

ముస్లిం సమాజంపై విష ప్రచారాన్ని ఖండిద్దాం!!

కరోనా వైరస్ మానవ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. జనం చచ్చిపోతున్నారు. అనేక మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చనిపోవటం ఒక రకమైన విషాదమైతే బతుకు దెరువు కోల్పోయి నరకయాతన అనుభవిస్తూ బతకటం మరింత ఘోరమైన విషాదం. కులం, వర్గం, మతూ, లింగం, ప్రాంతం, దేశాలకి అతీతంగా కరోనా వైరస్ విస్తరిస్తుంది. అన్ని రకాల ప్రజలకి, అన్ని దేశాల ప్రభుత్వాలకి ఇది ఒక పెను సవాలు. ప్రజలను ఈ విపత్తు నుండి రక్షించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వాలపైనే వుంటుంది. ఈ విపత్తు పట్ల ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అందుబాటులో వున్న వైద్య, పోలీసు, మీడియా, సామాజిక, సాంకేతిక, మానవ వనరులని సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్, క్వారంటైన్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ లాంటి పద్దతులని అమలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే మన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ అమలు చేస్తూనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వ్యూహాలతో కరోనాని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయి. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుతో జనతా కర్ఫ్యూ, చప్పట్లు కొట్టటం, దీపాలు వెలిగించటం లాంటి కార్యక్రమాలలో కోట్లాదిమంది దేశ ప్రజలు కుల, మతాలకి అతీతంగా పాల్గొన్నారు.

ఇదే సమయంలో మరొక వాస్తవాన్ని కూడా గమనించాలి. ప్రభుత్వం లాక్ డౌన్ అమలులోకి తెచ్చిన పద్ధతి కోట్లాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. హడావుడిగా కాకుండా, తగినన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ప్రజలు సిద్దపడేందుకు, సర్దుకునేందుకు, తమ తమ ప్రాంతాలకి, ఇళ్ళకి చేరుకోటానికి కొంత సమయాన్నిచ్చి, అవసరమైన ఏర్పాట్లని చూపించి లాక్ డౌన్ చేసివుంటే పేద ప్రజలకి కొంతలో కొంతైనా మేలు జరిగేది. పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలనుంచి పట్టణాలకు వచ్చి బతుకులు వెళ్లమారుస్తూన్న కోట్లాదిమంది అసంఘటిత నిరుపేద వలస కార్మికులు, శ్రమజీవులు పిల్లాపాపలతో వీధుల పాలయ్యారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తమతమ ఇళ్ళకి చేరుకోవాలని ఆకలి దప్పులతో వందలు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తున్నారు. పసిపిల్లలు, ముసలివాళ్ళు ఆకలి చావులు చస్తున్నారు. మరోప్రక్క మధ్య తరగతి కుటుంబాలలో గృహహింస పెరిగిపోయి మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నట్టు తెలుస్తుంది. రోజువారీ కూలిమీద, రోజువారీ బేరాల మీద ఆధారపడి బతికే అనేక కుటుంబాలు కనీస అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఎన్నో కష్టాలని, నష్టాలని ఎదుర్కొంటూ, బతుకు బీభత్సాన్ని దిగమింగుకుంటూ ప్రజలు, మరీముఖ్యంగా పేదవాళ్ళు ప్రభుత్వ ఆదేశాలకి, నియమ నిబంధనలకి కట్టుబడి,ఈ కరోనా మహమ్మారి నుండి ఎప్పుడూ బయటపడదామా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఒకరికొకరు తోడుగా, ప్రేమగా, పలకరించుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ రోజుల్ని లెక్కిస్తున్నారు.

ఈ సానుకూల వాతావరణాన్ని కలుషితం చేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది. న్యూఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగ్ జమాఅత్ కేంద్ర కార్యాలయం (మర్కజ్)లో జరిగిన ఒక ధార్మిక సదస్సును నెపంగా తీసుకొని ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో విష ప్రచారం మొదలయింది. భారత దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తికి కేవలం తబ్లీగ్ జమాఅత్ లేదా ముస్లిం సమాజమే పూర్తిగా కారణం అనే రీతిలో ఈ ప్రచారం సాగుతుంది. ‘కొరోనా జిహాద్’, కోరోనా ఉగ్రవాదం’, ఇస్లామిక్ పునురుత్థానం’, వంటి పదాలు కూడా వాడుకలోకి వొచ్చాయి. భారత దేశానికి మళ్ళీ కొత్తగా ముస్లిం ముప్పు ముంచుకు వచ్చిందనే కథనాలతో మీడియా మారుమోగుతుంది. ప్రస్తుత సందర్భంతో ఏ మాత్రం సంబంధం లేని రకరకాల దృశ్యాలను జత చేసి, వింత వింత కథనాలను మీడియా ప్రసారం చేస్తుంది. ఉన్నట్టుండి ముస్లింలు కొత్తగా ఏదో ప్రమాదకరమైన పెద్ద విద్రోహ చర్యకు పాల్పడ్డారా అని మిగిలిన సమాజం భయభ్రాంతం అయ్యేంతగా ఈ ప్రచారం సాగుతుంది. అనేక పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ముస్లింల పట్ల వ్యతిరేక వైఖరి తీసుకొని బలంగా ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ముస్లింలను ముట్టుకుంటే చాలు కోరోనా వైరస్ అంటుకుంటుందని అనుమానాలు సృష్టిస్తున్నాయి. కోరోనా వైరస్ నుండి ఆత్మ సంరక్షణకు పాటిస్తున్న సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) ముస్లింల విషయంలో సామాజిక వెలివేత (సోషల్ బాయ్ కాట్) రూపం ధరిస్తుంది. ఈ పరిస్థితి సమిష్టిగా కోరోనాపై సాగుతూన్న పోరాటస్పూర్తికి గొడ్డలి పెట్టు. వైద్యులు ముస్లింలకు వైద్య సేవలు అందించటానికి భయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనేక చోట్ల ముస్లింలను పనుల్లోకి రావొద్దని ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. దేశ వ్యాపితంగా ముస్లింలు అపరాధ, అభద్రతా భావనతో బతుకులు వెళ్ళదీయాల్సిన దుస్థితి దాపురించింది. మిగిలిన సాధారణ బాధలతో పాటు ముస్లిం సమాజం అదనంగా దారుణమైన మానసిక హింసను అనుభవిస్తున్నది. ప్రజల్లో పరస్పరం అవిశ్వాసం, విద్వేషం పెంచి సమాజాన్ని నిట్టనిలువుగా చీల్చే ఈ చర్యలు విద్రోహపూరితమైనవి, విచ్ఛిన్నకరమైనవి, చట్ట విరుద్ధమైనవి. కరోనా వ్యాప్తికి ఒక వర్గమో, కులమో, మతమో కారణం కాదని అందిరికీ తెలుసు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని, ఏ ఒక్క దేశ సమస్య కాదని, ఇది సమస్త మానవాళి ఎదుర్కొంటున్న ఒక మహా విపత్తు అని, కరోనా ఒక మహమ్మారి అని తెలియని మనిషి లేరంటే అతిశయోక్తి కాదు.

మన దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తికి కారణాలు అనేకం అయినా సమిష్టిగా బాధ్యత వహించాల్సిన సమయం. ఈ విపత్తుని ఎదుర్కొనటంలో మనకి అనేక పరిమితులు, వైఫల్యాలు వున్నా వాటిని ప్రక్కన పెట్టి మనకున్న మానవ వనరులు, విలువలపై ఆధార పడాల్సిన సమయం. మన దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తికి కేవలం తబ్లీగ్ జమాఅత్, లేదా ముస్లింల చర్యలే కారణం అనే విష ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం. కొంతమంది మత విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు కావాలనే ఒక పథకం ప్రకారం ముస్లిం సమాజాన్ని వికృతీకరిస్తూ సామాజిక మాధ్యమాలలో అమానవీయమైన ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి క్రూరమైన చర్యల్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఈ చర్యలకి బాధ్యులైన వారిపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నాం. అదే విధంగా మరోసారి ముస్లింలను బలిపశువులను చేసే కుతంత్రాల్ని బట్టబయలు చేసి, మత సామరస్యాన్ని పెంచే దిశగా ప్రయత్నించాలని అన్ని రకాల మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మర్కజ్ ధార్మిక సదస్సులో పాల్గొన్నవారు, వీరితో కలిసిన ఇతర ముస్లింలు స్వచ్చందంగా ఆయా అధికారుల వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకొని, డాక్టర్ల సలహాలు పాటించి, ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము.

కరోనా వైరస్ ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఇది సమస్త మానవాళి ఎదుర్కొంటున్న ఒక మహా విపత్తు. సమైక్యంగా, సంఘటితంగా, రాజకీయాలకీ, మతాలకీ అతీతంగా మనం ఈ మహమ్మారిని ఎదుర్కొందాం.

ఇట్లు …
బూర్గుల నర్సింగరావు, స్వాతంత్ర సమర యోధులు; కె. శ్రీనివాస్, ఎడిటర్, ఆంధ్రజ్యోతి; ప్రొఫెసర్ రమా మేల్కోటే; కె. రామచంద్ర మూర్తి, సీనియర్ జర్నలిస్ట్; ప్రొఫెసర్ హరగోపాల్, పౌర హక్కుల సంఘం నాయకులు; జహీర్ అలీ ఖాన్, సియాసత్; అమీర్ అలీ ఖాన్, సియాసత్; అల్లం నారాయణ, జర్నలిస్ట్; బి. నర్సింగరావు, సినీదర్శకుడు; ఖాదర్ మొహియుద్దీన్, జర్నలిస్ట్; గీతా రామస్వామి, ప్రచురణకర్త; విమల, కవి; లెల్లె సురేష్, కవి; జీవన్ కుమార్, వి.యస్.కృష్ణ, మానవ హక్కుల వేదిక; జస్టిస్ చంద్రకుమార్; ఎన్. వేణుగోపాల్, జర్నలిస్ట్; బి.బి.జి. తిలక్, రచయిత; గుంటూరు లక్ష్మీనరసయ్య, సాహితీ విమర్శకులు; కాత్యాయని, రచయిత; అంబటి సురేందర్రాజు, కాత్యాయనీ విద్మహే, రచయిత; శంకర్, కార్టూనిస్టు; దేవిప్రియ, కవి; గోరటి వెంకన్న, వాగ్గేయకారుడు; భూమన్, రచయిత; ప్రసేన్, కవి, జర్నలిస్ట్; వేంపల్లి షరీఫ్, రచయిత, జర్నలిస్ట్; విమల, సామాజిక కార్యకర్త; ప్రసాదమూర్తి, కవి; ఆర్.వి. రామారావు, జర్నలిస్ట్; అరసవిల్లి కృష్ణ, విరసం; జి. ఆర్. అంబేద్కర్, న్యాయవాది; ఆర్ భరద్వాజ, జర్నలిస్ట్; వరలక్ష్మి, విరసం; బుడ్డిగ జమిందార్, జర్నలిస్ట్; పల్నాటి శ్రీరాములు, బహుజన కెరటాలు; మమత వేగుంట, పెయింటర్; తాడి ప్రకాష్, జర్నలిస్ట్; దేశరాజు, కవి; పి. సత్యవతి, రచయిత; స్కైబాబా, కవి; బండ్ల మాధవరావు, కవి; సత్యరంజన్, సంగమం; సి. ఉమామహేశ్వరరావు, సినీదర్శకుడు; ఖాజా, కవి; వాహెద్, కవి; జహాఆరా, న్యాయవాది; షాజహానా, కవి; శిరంశెట్టి కాంతారావు, రచయిత; ముత్యాల ప్రసాద్, ఎడిటర్, విశాలాంధ్ర; కంఠంనేని రాజగోపాల్, రచయిత; కె.యన్.మల్లీశ్వరి, రచయిత; అమరేంద్ర దాసరి, రచయిత; కొసరాజు సురేష్, ప్రచురణ కర్త; దుర్గం సుబ్బారావు, జర్నలిస్ట్; సజయ కాకర్ల, సామాజిక కార్యకర్త; ఆర్.కె. ( పర్స్పెక్టివ్స్); ముప్పాళ్ల భార్గవశ్రీ, రచయిత; కొత్తపల్లి రవిబాబు, రచయిత; బాలరెడ్డి, మలుపు; దేవి, సాంస్కృతిక కార్యకర్త; సి.యస్.ఆర్. ప్రసాద్, విరసం; నల్లూరి రుక్మిణి, రచయిత; మందరపు హైమవతి, కవి; దివికుమార్, జనసాహితి; ప్రసాద్, సిపిఐ ఎం ఎల్; జ్యోతి, జర్నలిస్టు; గాలి నాసరరెడ్డి, కవి; ఓల్గా, రచయిత; అక్కినేని కుటుంబరావు, రచయిత; సి. రామ్మోహన్, రచయిత; ఎ. రాజేంద్రబాబు, రచయిత; రమా సుందరి, రచయిత; సుమిత్ర, అంకురం; బజరా, రచయిత; ఎస్. జె. కళ్యాణి, రచయిత; రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక; కె.అచ్యుత రామారావు, AIKMS; కె.రణధీర్,
AIKMS; V. సంధ్య, POW; సుభద్ర, POW; అరెళ్ళి కృష్ణ, IFTU; ఎం.శ్రీనివాస్,IFTU; పి. వరదయ్య, PYL; ఏ.రాజేందర్, PYL; ఎం.పరుశురాం,PDSU; విజయ్ కన్నా, PDSU; పి. వేణు, అరుణోదయ; ఎం. నిర్మల, అరుణోదయ; శ్రీశైల్ రెడ్డి పంజుగుల; కందుకూరి రమేష్ బాబు, ఫోటోగ్రాఫర్; అరుణాంక్ లత, రచయిత; జి. వెంకట కృష్ణ, రచయిత; అనిల్ అట్లూరి, రచయిత; బి. నర్సింహ, OPDR; తాయమ్మ కరుణ, రచయిత; అపర్ణ తోట, రచయిత; అరణ్యకృష్ణ, రచయిత; శాంతి ప్రబోధ , రచయిత; విస్సా కిరణ్, రైతు స్వరాజ్య వేదిక; కొండవీటి సత్యవతి, సోషల్ ఏక్టివిస్ట్; కూర్మనాథ్, జర్నలిస్ట్; ఎస్ ఆశాలత, సామాజిక కార్యకర్త; ఎస్. రమ, జర్నలిస్ట్; నారాయణ స్వామి, కవి; అట్టాడ అప్పలనాయుడు, రచయిత; ; రవి కన్నెగంటి, రైతు స్వరాజ్య వేదిక; ఆలూరు రాఘవశర్మ, జర్నలిస్ట్; కత్తి పద్మ , మహిళా చేతన; వివినమూర్తి ,రచయిత; భండారు విజయ ,రచయిత; మృణాలిని, రచయిత; కల్పన కన్నాభిరాన్, ఫెమినిస్ట్ సోసియాలజిస్ట్, హ్యూమన్ రైట్స్ కాలమిస్ట్; వసంత కన్నాభిరాన్, ఫెమినిస్ట్ రైటర్, కవి; ప్రొఫెసర్ పద్మజా షా, ఉస్మానియా యూనివర్సిటీ; శ్యామ్ రావు సామాజిక కార్యకర్త, బి.సుబ్రహ్మణ్యం PUDR ఢిల్లీ, రంగస్థల కార్యకర్త; సాదిక్ అహ్మద్,JIH; కె. లలిత, అన్వేషి; వసంత లక్ష్మి, జర్నలిస్ట్; మధురాంతకం నరేంద్ర, రచయిత; ఉణుదుర్తి సుధాకర్, రచయిత; ప్రొఫెసర్ U వింధ్య; ఖలీదా పర్వీన్, సామాజిక కార్యకర్త; కె. సుభాషిణి, రచయిత; బాల్ రాజ్, AITUC; టి. విశ్వేశ్వరరావు, AIKS; కాంతయ్య, BKMUK; సృజన, NFIWV; సయ్యద్ వలీయుల్లా ఖాద్రీ, AIYF; అశోక్ స్టాలిన్, AISFN; కె.శ్రీనివాస్, IPTA; డాక్టర్ వీరాచారి, PWA; కె.ప్రభాకర్, దళిత్; పున్నెం శ్రీనివాస్, గిరిజన; యాదయ్య, AIPSO; మునీర్ పటేల్, INSAF; పంజరం రమేష్, JSD; సదానంద గౌడ్, STUG; బొమ్మగాని ప్రభాకర్, IAL; అరుణ్ కుమార్, ISCUFS; ఎస్. విఠల్, TS MEU; ఎస్. బాబు, TS RTCEU. Dr. నళిని ,రచయిత Dr. గీతాంజలి , రచయిత, అంబిక, సామాజిక కార్యకర్త , బ్రదర్ వర్గీస్ , డైరెక్టర్ ఎమ్.ఎస్. ఐ.

One thought on “మతాలకతీతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం!

Leave a Reply