రాత్రి శ్రీశ్రీ గారి కబురు వినగానే చతికిలబడిపోయాను. అయితే పొద్దున ఎ.ఐ.ఆర్. వాళ్ళు ఫోన్ చేసి చెప్పేదాకా శ్రీశ్రీగారు పోయారనే మాట…
Author: రావిశాస్త్రి
కథా రచయిత. విరసం వ్యవస్థాపక సభ్యుడు. వృత్తి రీత్యా న్యాయవాది. 1922, జూలై 30న శ్రీకాకుళంలో జన్మించాడు. సొంతూరు అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. అసలు పేరు రాచకొండ విశ్వనాథ శాశాస్త్రి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తత్వ శాస్త్రంలో బీ.ఏ (ఆనర్స్), మద్రాసు యూనివర్సిటీ నుండి 1946లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. మొదట్లో కాంగ్రెస్ వాది. 1960లలో మార్క్సిస్ట్ సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో పదునైన రచనలు చేశాడు.
రచనలు: మార్చు; కథాసాగరం (1955); ఆరుసారా కథలు (1961); రాచకొండ కథలు (1966); ఆరుసారో కథలు (1967); రాజు మహిషి (1968); కలకంఠి (1969); బానిస కథలు (1972); ఋక్కులు (1973); ఆరు చిత్రాలు (1974); రత్తాలు-రాంబాబు (1975); సొమ్ములు పోనాయండి; గోవులోస్తున్నాయి జాగ్రత్త; బంగారం; ఇల్లు; నాటకం / నాటికలు : నిజం (నాటకం); తిరస్కృతి (నాటిక); విషాదం (నాటిక). 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసాడు. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా . ఆయన రాసిన నిజం నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆ రోజుల్లోనే( 1962లో) వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. 10 నవంబర్, 1993న మరణించాడు.
విరసం చేతిలో మహత్తర శక్తి శ్రీశ్రీ
8-7-83 తేదీగల మీ పత్రికలో మా పెదబాబాయి, చినబాబాయి అంటూ శ్రీ ఆరుద్ర రాసిన వ్యాసం మహాకవి శ్రీశ్రీ గారిని కించపరచేదిగానూ,…