గూడ అంజన్న పాట – ‘భద్రం కొడుకో’

రచయితగా, ప్రజాగాయకుడిగా తెలంగాణ సమాజానికి సుపరిచితుడు గూడ అంజయ్య. ఆయన ఆదిలాబాదు జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో గూడ లక్ష్మయ్య, లక్ష్మమ్మ దంపతులకు నవంబరు 1న, 1954లో జన్మించారు. హైదరాబాదులో బీఫార్మసీ చదివి, ఉట్నూరులో ఫార్మసిస్టుగా ప్రభుత్వ ఉద్యోగం లో చేరారు. అంజన్న రాసిన 'ఊరు మనదిరా' పాట దేశవ్యాప్తంగా గ్రామీణులను ఉర్రూతలూగించింది. ఆ పాట పదహారు భాషల్లోకి అనువాదమైంది. 'అయ్యోనివా నువ్వు...అవ్వోనివా' అంటూ ఆంధ్ర పెట్టుబడి వర్గాల మీద రాసిన పాట తెలంగాణ ఉద్యమంలో భావసంచలనం రగిలించింది. ఇలాంటి ఎన్నో గొప్ప పాటలు విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమంలో యువతను ముందుకు నడిపించాయి. పొలిమేర (నవల), దళిత కథలు(కథా సంపుటి) ప్రచురించారు. జూన్ 21, 2016లో రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని స్వగ్రుహంలో అనారోగ్యంతో తదిశ్వాస విడిచారు.

Leave a Reply